విశాఖ ఎకనామిక్ రీజియన్ సదస్సు(Visakhapatnam Economic Region Conference)కు సీఎం చంద్రబాబు హాజరై ప్రసంగించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ డాక్యుమెంట్ను విడుదల చేశారు. నీతిఆయోగ్ సీఈఓ (Niti Aayog CEO) సుబ్రహ్మణ్యం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖను మోస్ట్ లివబుల్ సిటి(Most Livable City)గా తీర్చిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రధాని మోదీ (PM Modi) కూడా ఏపీ అభివృద్ధి(AP Development)కి సహకరిస్తున్నారని అన్నారు. 2038కి భారత్ రెండో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా మారుతుందని, 2047కు అగ్ర స్థానంలోకి రావటాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..
- రాష్ట్ర అభివృద్ధి కోసమే ఓ విజన్ తయారు చేసుకుని అమలు చేస్తున్నాం
- దేశంలోని నాలుగు నగరాలకు విజన్ తయారు చేయాలని కేంద్రం నిర్దేశించింది.
- ముంబై, వారణాసి, సూరత్ , విశాఖల అభివృద్ధికి ఈ విజన్ అమలు చేయాలని నిర్ణయించింది
- అక్షర క్రమంలో, అభివృద్ధి పోటీలో ఏపీనే ఎప్పుడూ ముందుంటుంది.
- సాగర తీరాన ఉన్న విశాఖ నగరం దేశంలోనే అత్యంత సుందరమైన ప్రాంతం
- గత పాలకులు రాష్ట్రాన్ని, దాని అభివృద్ధిని సర్వనాశనం చేశారు.
- అందుకే కూటమిగా ప్రజల మద్దతుతో పునర్నిర్మాణం చేస్తున్నాం
- రూ.2.66 లక్షల కోట్ల ఎంఓయూలు సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ కంటే ముందే చేశాం
- 17 నెలల్లోనే రాష్ట్రానికి 20 లక్షల కోట్ల పెట్టుబడులు తేగలుగుతున్నాం
- గూగుల్ డేటా సెంటర్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో వస్తోంది
- అనకాపల్లిలో దాదాపు రూ.1 లక్ష కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మించబోతోంది
- 9 జిల్లాలతో ఏర్పాటు చేస్తున్న విశాఖ ఎకనామిక్ రీజియన్ భవిష్యత్ ఆర్థిక శక్తిగా ఏపీని నిర్దేశించే ఓ మోడల్
- విశాఖను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్, సుస్థిర అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం
- విశాఖపట్నం ఇండస్ట్రియల్ రీజియన్ మాస్టర్ ప్లాన్– 2040కు రూపకల్పన చేశాం
- తూర్పుతీరంలో వీఈఆర్ దేశ ఆర్ధిక ప్రగతికి గేట్వేగా పనిచేస్తుంది.
- అన్ని వనరులూ 9 జిల్లాలతో కూడిన విశాఖ ఎకనామిక్ రీజియన్ కు ఉన్నాయి.
- విశాఖ ఎకనామిక్ రీజియన్ అథారిటీకి చైర్మన్ హోదాలో నేనే స్వయంగా అభివృద్ధిని పర్యవేక్షిస్తాను.
- Advertisement -
