- 15వ వార్డు కౌన్సిలర్ వేణు గోపాల్ గౌడ్
ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని బర్మాజీగూడ గ్రామంలో ప్రజలు నీటి సమస్యతో ఇబ్బందులు పడడంతో 15వ వార్డు కౌన్సిలర్ వేణు గోపాల్ గౌడ్ శుక్రవారం తన సొంత నిధులతో గ్రామంలో త్రాగునీరు కోసం నూతనంగా బోరు వేయించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15వ వార్డు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డబిల్ పూర్ గ్రామ మాజీ సర్పంచ్ దుడ్డు సంజీవ రావు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యాది రెడ్డి, అంజి రెడ్డి, శ్రీధర్, బట్టు మధు, సత్యనారాయణ, బిక్షపతి, మహేష్, శంకర్, దేవేందర్, వీరేష్, వెంకటేష్, సహదేవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -
