భారత రాష్ట్ర సమితి పార్టీ (BRS Party) యునైటెడ్ కింగ్డమ్(UK) శాఖ ఆధ్వర్యంలో దీక్షా దివస్(Diksha Diwas) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ లీడర్లు, తెలంగాణవాదులు (Telanganaists) పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్ఆర్ఐ (NRI) యూకే విభాగం అధ్యక్షుడు రవికుమార్ అధ్యక్షత వహించారు. 2009 నవంబర్ 29న కేసీఆర్(KCR) ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష (Hunger Strike To Death).. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం(Telangana Separate State)గా ఏర్పాటుకావటంలో ముఖ్యమైన అధ్యాయమని చెప్పారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అనే నినాదం చాలా ప్రభావవంతంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లిందని తెలిపారు. శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవటం ప్రపంచానికే ఆదర్శమని పలువురు నేతలు పేర్కొన్నారు.
- Advertisement -
