హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన ‘ఖాళీయ మర్దనం’(Kaaliya Mardhanam) నృత్య రూపకం (Dance Form) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం(Deputy CM) మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhattivikramarka) హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన గుర్తింపునిచ్చే ‘కాకతీయం’ (Kakatiyam) నృత్య శైలిని పుస్తక రూపంతోపాటు నృత్య రూపకంగా ప్రపంచానికి పరిచయం చేసిన పద్మశ్రీ డాక్టర్ పద్మజా రెడ్డి(Padmaja Reddy)ని, ఆమె శిష్య బృందాన్ని అభినందించారు.
‘మన దేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక నృత్య శైలి ఉన్నట్లే.. తెలంగాణకు కాకతీయం ప్రత్యేకమైంది. యుద్ధానికి వెళ్లే ముందు సైనికుల్లో ఉత్తేజాన్ని, శక్తిని నింపే పేరిణి నృత్యాన్ని అద్భుతంగా రూపొందించి చూపించిన పద్మజారెడ్డి బృందానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వక అభినందనలు’ అని పేర్కొన్నారు.
