కరీంనగర్:- సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(నూతన కలెక్టరేట్ బిల్డింగ్) నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. కార్యాలయం చుట్టూ చేపట్టిన మౌలిక సదుపాయాలను పర్యవేక్షించారు. వసతులు, సదుపాయాల కల్పనలో అధికారులకు పలు సలహాలు ఇచ్చారు. సూచనలు చేశారు. పనులు వేగవంతంగా, నాణ్యంగా చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు ఉన్నారు.
- Advertisement -
