ఓ రైతు నుండి సుమారు రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా చండూరు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ ను ఏసీబీ అధికారులు గురువారం రాత్రి పట్టుకున్నారు.. మునుగోడు నియోజకవర్గం గట్టుపల్ మండలం, తెరట్పల్లి గ్రామానికి చెందిన ఒక అక్రమ రిజిస్ట్రేషన్ పై సమాచార హక్కు చట్టం కింద బాధితులు వివరాలు కోరగా అందుకు గాను సుమారు రూ.20 వేలు డిమాండ్ చేయగా బాధితులు ఏసీబీని ఆశ్రయించినట్లు తెలిసింది.
బాధితుడు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ బాలాపూర్ లోని తన నివాసంలో అధికారులు పట్టుకున్నారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది…
- Advertisement -
- Advertisement -
