Sunday, October 26, 2025
ePaper
Homeఆరోగ్యంBreast Cancer | రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పుస్తకం

Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పుస్తకం

ఆవిష్కరించిన మంత్రి సీతక్క, హీరోయిన్ శ్రీలీల

యశోద హాస్పిటల్స్(Yashoda Hospitals)-హైటెక్ సిటీ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేష్ గౌడ్ రచించిన “పింక్ పవర్” (Pink Power) రొమ్ము క్యాన్సర్ అవగాహన పుస్తకాన్ని తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Seethakka), ప్రముఖ నటి శ్రీలీల(Srileela) ఆవిష్కరించారు.

భారతదేశం(India)లో రోజురోజుకీ రొమ్ము క్యాన్సర్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మన దేశంలో రొమ్ము క్యాన్సర్ చికిత్సలో అద్బుతమైన పురోగతి ఉన్నప్పటికీ, సరైన సమయంలో గుర్తించకపోవడం వల్ల మనుగడ రేట్లు ఇప్పటికీ అభివృద్ధి చెందిన దేశాల కంటే వెనుకబడి ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం సరైన అవగాహన లేకపోవడం మరియు రొమ్ము క్యాన్సర్ ఆలస్యంగా నిర్ధారణ జరగడం. దురదృష్టవశాత్తు, మన దేశంలో చాలా మంది మహిళలు ఇప్పటికీ ముందుకు వచ్చి తమ సమస్యలను వ్యక్తపరచడానికి వెనుకాడతారు. ఆంకాలజీ క్యాన్సర్ చికిత్సా వైద్య రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం ఉన్న యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ & రోబోటిక్ సర్జన్ అయిన డాక్టర్. రాజేష్ గౌడ్, రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్, ముందస్తు హెచ్చరిక సంకేతాలు, పోషకాహారం, వ్యాయామం, చికిత్స సమయంలో మరియు తరువాత సమగ్ర శ్రేయస్సుపై మహిళలకు అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకొని రాసిన “పింక్ పవర్” అనే పుస్తకాన్ని ఈ రోజు తెలంగాణ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మరియు ప్రముఖ సినీ నటి శ్రీలీల ముఖ్య అతిథిలుగా హాజరై యశోద హాస్పిటల్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్. జి.ఎస్. రావుతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా తెలంగాణ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ… “భారతదేశంలోని మహిళల్లో అత్యంత సాధారణంగా వచ్చే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ (Breast Cancer) ఒకటి. మన దేశంలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో రొమ్ము క్యాన్సర్ రోజురోజుకీ పెరుగుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మరియు నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ నుండి వచ్చిన తాజా గణాంకాల ప్రకారం, భారతీయ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ మొత్తం క్యాన్సర్లలో 27-32% వరకు ఉంది. రొమ్ము క్యాన్సర్ ను ప్రాథమిక దశలో గుర్తించకపోవడం వల్ల దాని పెరుగుదల యొక్క ఉన్నత దశలలో చికిత్సా చాలా కష్టమవుతుంది. 50% కంటే ఎక్కువ మంది భారతీయ మహిళలలో రొమ్ము క్యాన్సర్ 3-4 దశలో మాత్రమే బయటపడుతుంది. దీనికి ప్రధాన కారణం రొమ్ము క్యాన్సర్ పై మహిళలలో సరైన అవగాహన లేకపోవడమే అని అన్నారు. కొంత అవగాహనతో స్త్రీలు తమ పరిస్థితిని స్వీయ-నిర్ధారణ చేసుకోవచ్చు అందుకు డాక్టర్. రాజేష్ గౌడ్, రచించిన “పింక్ పవర్” అనే ఈ పుస్తకం రొమ్ము క్యాన్సర్ పై అవగాహనకు గొప్ప సహాయక వ్యవస్థ” అని, మంత్రి సీతక్క తెలిపారు.

“అధునాతన శస్త్రచికిత్సలతో ఇప్పుడు ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధికి సమర్ధవంతమైన చికిత్సలు మనకు అందుబాటులోనే ఉన్నాయి. క్యాన్సర్ వ్యాధిని జయించవచ్చు ఇందుకు క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించడం కీలకం నమ్మకం కోల్పోవద్దు. మహిళలు సంకోచంలేకుండా తమ సమస్యలను బయటకు చెప్పుకోవాలి సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్ అంటే జీవితంపై ఆశను వదులుకోకండి డాక్టర్. రాజేష్ వంటి వైద్య నిపుణులు & యశోద హాస్పిటల్స్ వంటి ప్రపంచస్థాయి హాస్పిటల్స్ మీకు క్యాన్సర్ వ్యాధికి ఉత్తమ చికిత్సలు అందించడానికి మీ కోసం సిద్ధంగా ఉన్నారు. మహిళల సంక్షేమం కోసం ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని యశోద హాస్పిటల్స్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది.” అని ప్రముఖ సినీ నటి శ్రీలీల తెలిపారు.

“యశోద హాస్పిటల్స్-క్యాన్సర్ సెంటర్ సమగ్ర క్యాన్సర్ సంరక్షణ కోసం ఒక ఎక్సలెన్స్ సెంటర్‌గా ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానంతో మనం క్యాన్సర్ ‌పై విజయం సాధించవచ్చని. పెట్టు స్కాన్, యం. ఆర్. లినాక్ వంటి కొత్త డయాగ్నొస్టిక్ పద్ధతులు ఒక సెంటీమీటర్ కంటే తక్కువ పరిమాణంలో ఉన్న క్యాన్సర్ కణితిని కూడా గుర్తించగలవు. యం. ఆర్. లినాక్ రేడియేషన్, టార్గెటెడ్ థెరపీ మరియు ఇమ్యునోథెరపీ వంటి అత్యాధునిక చికిత్స విదానాలు క్యాన్సర్ రోగులకు మెరుగైన చికిత్స మరియు జీవన నాణ్యతను అందించే లక్ష్యంతో రూపొందించాబడిన అత్యాధునిక చికిత్స విదానాలు. రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా, డాక్టర్. రాజేష్ గౌడ్ సమగ్రమైన ఆధారాల, ఆధారితంగా రచించిన “పింక్ పవర్” అనే పుస్తకం సరళమైన, సులభంగా అర్థమయ్యే భాషలో వ్రాయబడింది మరియు బహుళ భారతీయ భాషలలో అందుబాటులో ఉంది. ఈపుస్తకం రొమ్ము క్యాన్సర్ ను ఓడించడంలో సహాయం చేస్తుందని “రొమ్ము క్యాన్సర్” అనే పేరు చుట్టూ ఉన్న కళంకం నుండి తమను తాము రక్షించుకోవడానికి ఎవరికైనా ఆశను కల్పిస్తుందని”. యశోద హాస్పిటల్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్. జి.ఎస్. రావు అన్నారు.

యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్. రాజేష్ గౌడ్ , మాట్లాడుతూ… “చాలా మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ అనగానే వారి రొమ్ము గుర్తింపును కోల్పోవడం అని భయపడుతున్నారు. అది ఇకపై నిజం కాదు. లాపరోస్కోపిక్ మరియు రోబోటిక్ సర్జరీతో అత్యంత క్లిష్టమైన క్యాన్సర్ శస్త్రచికిత్సలు చేయవచ్చు. ప్లాస్టిక్ మరియు పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు, ప్రభావితమైన అవయవాలను తొలగించిన తర్వాత ఎలాంటి వైకల్యం లేకుండా ఉండే అద్భుతమైన సౌందర్య రూపాన్ని తిరిగి పొందే అత్యాధునిక చికిత్స విదానాలు అందుబాటులో ఉన్నయని. ముందస్తు రోగ నిర్ధారణ మరియు అధునాతన ఆంకోప్లాస్టిక్ రొమ్ము శస్త్రచికిత్సలతో, క్యాన్సర్ ఫలితాలతో రాజీ పడకుండా మనం రొమ్మును కాపాడుకోవచ్చు మరియు స్త్రీ గౌరవాన్ని కాపాడుకోవచ్చు” అని డాక్టర్. రాజేష్ గౌడ్, తెలియజేసారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News