తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు(Government Advisor), ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి(Pocharam Srinivas Reddy) ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం(Gram Panchayat Election Compaign)లో పాల్గొన్నారు. అన్నారం, చించోలి, కిష్టాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థులకు ఓటేయాలని ప్రజలను కోరారు. విద్యావంతులకు, నిజాయతీ కలిగినవారికి సపోర్ట్ చేసి సర్పంచ్లుగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. డబ్బు, మద్యం, చీరలు తదితర ప్రలోభాలకు గురికావొద్దని, స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
- Advertisement -
