వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రోపర్టీ ఆర్గనైజేషన్(World Intellectual Property Organization-WIPO) డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్, డైరెక్టర్ అనిల్ మూర్తితో ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) భేటీ అయ్యారు. ఆవిష్కరణలకు ప్రోత్సాహం, మేధోసంపత్తి హక్కుల రక్షణ, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి(Development of the startup ecosystem), పరిశోధన–అభివృద్ధి(R and D), పేటెంట్ వ్యవస్థ(Patent System) బలోపేతం అంశాలపై చర్చించారు. ఆర్థిక వృద్ధికి ఆవిష్కరణలు కీలకమని, ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ ఎకానమీ, ఇన్నోవేషన్ ఆధారిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. రాష్ట్రంలో స్టార్టప్ వ్యవస్థకు డబ్లుఐపీఓ సహకారం అందించాలని కోరారు.
- Advertisement -
