ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) ఆదివారం అయోధ్యకు వెళ్లారు. అక్కడికి చేరుకున్న ఆయనకు యూపీ, అయోధ్య దేవాలయ అధికారులు ఘన స్వాగతం(Grand Welcome) పలికారు. అనంతరం.. దివ్యమైన, అద్భుతమైన శ్రీరామ జన్మభూమి మందిర్(Sri Rama Janmabhoomi Mandir)లో దైవ దర్శనం చేసుకొని ప్రార్థనలు(Prayers) చేశారు. మరోసారి ఇక్కడకు రావడం ప్రశాంతమైన, ఆధ్యాత్మికంగా ఉత్తేజకరమైన అనుభవమని పేర్కొన్నారు. శ్రీరాముడి విలువలు, ఆదర్శాలు మనందరికీ శాశ్వతమైన పాఠాలని చెప్పారు. అవి ఎల్లప్పుడూ మనల్ని నడిపిస్తూ, ప్రేరేపిస్తూ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.





- Advertisement -
