ఆంధ్రప్రదేశ్(AndhraPradesh)లో ఇవాళ జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) మాట్లాడుతూ.. జిల్లాలు అనుసరించే బెస్ట్ ప్రాక్టీసెస్ (Best Practices) ఇతర ప్రాంతాల్లోనూ అమలుచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. లక్ష్యాలకు అనుగుణంగా అమలు చేస్తే 15 శాతం వృద్ధి రేటు సాధన కష్టం కాదని తెలిపారు. నీటి భద్రత, ఉద్యోగాల కల్పన(Employment), అగ్రిటెక్ (Agritech) లాంటి అంశాల ద్వారా ఈ వృద్ధిని సాధిద్ధామని కోరారు. మన ప్రభుత్వానికి వారసత్వంగా 70 శాతం మేర ధ్వంసమైన రోడ్లు (Damaged Roads) వచ్చాయని పేర్కొంటూ పరోక్షంగా గత ప్రభుత్వాన్ని విమర్శించారు.

సీఎం చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..
- నీటి సమస్యలు, మద్ధతు ధరలు లేకపోవటం, భూ వివాదాలు, విద్యుత్ బిల్లులు ఎక్కువ రావటం లాంటి సమస్యలు కూడా గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా పెద్ద ఎత్తున వచ్చాయి.
- ఇప్పుడు మనం నీటి భద్రత తెచ్చాం. రైతులకు మెరుగైన ధరలు దక్కేలా చూస్తున్నాం. విద్యుత్ ఛార్జీలు పెంచకపోగా తగ్గించాం.
- ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి స్థాయి విశ్వసనీయత వచ్చింది. దీన్ని కాపాడుకోవాలి.
- ప్రజల నుంచి వచ్చిన గ్రీవెన్సులను కూడా వేగంగా పరిష్కరించి పారదర్శకంగా ఆన్లైన్లో ఉంచండి.
- లిటిగేషన్లపై ప్రజల్లో చైతన్యం పెంచి వాటిని పరిష్కరించుకునేలా అవగాహన పెంచుదాం.
- చేసిన పనిని సామాజిక మాధ్యమాల్లో చెప్పుకునేలా చర్యలు ఉండాలి.
- కలెక్టర్లు ప్రభుత్వానికి అంబాసిడర్లు.
- ప్రభుత్వంపై సానుకూలత రావాలంటే అధికారులదే కీలక పాత్ర.
- పొలిటికల్ గవర్నెన్సు అనేది కీలకం.
- కలెక్టర్లు తమ ప్రతిభ ద్వారా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూడాలి.
- ప్రతీ నిమిషం నన్ను నేను బెటర్గా తీర్చిద్దుకునేలా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటున్నాను.
- దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏపీ గురించే చర్చించుకోవాలి.
- స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ హైడ్రోజన్ సిటీల ద్వారా పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం.
- ప్రివెంటివ్, క్యురేటివ్, కాస్ట్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ద్వారా వైద్యారోగ్యాన్ని ప్రజలకు అందించాలి.
- ప్రజల్లో సంతృప్తిని పెంచేలా పౌర సేవలను అందించాలి.
- ఇళ్లు లేని పేదలు, రైతులు, మహిళలు, పిల్లలు, యువత ఇలా అన్ని వర్గాలకు మంచి చేయడం ద్వారా ప్రజల్లో సానుకూలత వస్తుంది.
- కొన్ని అంశాల్లో ప్రజాప్రతినిధుల సేవలను కూడా వినియోగించుకోవాలి.
- స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు అనేది చాలా ముఖ్యం.


- Advertisement -
