Saturday, October 4, 2025
ePaper
Homeఆంధ్రప్రదేశ్T-Hubలో గౌరీ భవానికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

T-Hubలో గౌరీ భవానికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

హైదరాబాద్, మియాపూర్‌కు చెందిన గృహిణి గౌరీ భవాని, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ 2.0ను విజయవంతంగా పూర్తి చేశారు. జూలై 26, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని గౌరీ భవానికి AI గ్రాడ్యేషన్ పట్టాను అందజేశారు.

ఈ సందర్భంగా గౌరీ భవాని మాట్లాడుతూ, “ఒక గృహిణిగా, తెలుగు AI బూట్ క్యాంప్ 2.0లో నేర్పిన AI టూల్స్‌ను ఆచరణాత్మకంగా ఉపయోగించడం ద్వారా నా సాంకేతిక నైపుణ్యాలు గణనీయంగా మెరుగయ్యాయి. ఈ శిక్షణ నా దైనందిన జీవితంలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మరియు భవిష్యత్తులో నూతన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఎంతగానో దోహదపడుతుందని నమ్ముతున్నాను. ఈ అవకాశం కల్పించిన డిజిప్రెన్యూర్ టీమ్‌కు, నికీలు గుండ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.

తరువాతి తెలుగు AI బూట్ క్యాంప్ 2.0 ఆగస్టు 11, 2025న ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలకు ఈ నంబర్లను సంప్రదించండి: 733 111 2687, 733 111 2686, 733 111 2688.

RELATED ARTICLES
- Advertisment -

Latest News