విద్యార్థిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్కు వినతిపత్రం అందించారు. నిర్మల్లోని మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థిపై కొంతమంది విద్యార్థులు దాడి చేశారని, దాడి చేసిన వారిపై చర్య తీసుకోవడంలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు.

- Advertisement -
