ఒక్క ఆధారం(Basis) లేదు. ఆరోపణల(Accusations)కు మాత్రం అడ్డు లేదు. పరిపాలన(Administration) చేతకాక ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నోటీసులే పాలనగా మారాయి. నిన్న హరీష్ రావు(Harish Rao). నేడు కేటీఆర్(KTR). రేపు ఇంకెవరో? ఇదేనా ‘ప్రజా ప్రభుత్వం’ పనితనం? వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్ అనే పాత క్యాసెట్ను మళ్లీ ప్లే చేస్తూ రాజకీయ కక్షసాధింపే ఏకైక ఎజెండాగా మార్చుకున్నారు. తాను పడిన గోతిలోంచి బయటపడలేక ఇతరుల్ని లాగేందుకు చేస్తున్న ఈ చౌకబారు నాటకాలు రేవంత్ రెడ్డి రాజకీయ దిగజారుడుకు నిదర్శనం. సాక్ష్యాల్లేని నోటీసులు చట్టం కాదు.. కేవలం వేధింపులే! నిజం ఆలస్యంగా అయినా తప్పకుండా వెలుగులోకి వస్తుంది. సత్యమేవ జయతే!
- దాసోజు శ్రవణ్ కుమార్, ఎమ్మెల్సీ
- Advertisement -
