గ్రేటర్ జిహెచ్ఎంసి పరిధిలోని బి జె ఆర్ నగర్ కృష్ణ నగర్ కాలనీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జింక నాగుల్ హాజరై వేడుకలకు శోభ చేకూర్చారు.

కాలనీ అధ్యక్షుడు వెంకటేష్ జాతీయ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరు పాటించాలని పిలుపునిచ్చారు.
- Advertisement -

ఈ కార్యక్రమంలో బొబ్బిలి మంజుల, శ్రీనివాస్, పల్లపు రవి, సంపత్, పద్మారావు, కృష్ణ, లింగం, శివకుమార్ గౌడ్, గంగాధర్, బి యాదగిరి పాల్గొన్నారు. కార్యకర్తలు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు.
- Advertisement -
