- బిసి సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు
గురువారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందని అమలు చేయడంలో విస్మరించిందని విమర్శించారు బీసీల ద్రోహం చేసిన మాధవరెడ్డికి కార్పొరేటర్ గా టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు ద్రోహం చేసిన మాధవరెడ్డిని కౌన్సిలర్ గా పోటీ నుంచినుంచి కెసిఆర్, కేటీఆర్ హరీష్ రావు, విరమింప చేయాలని ఆయన డిమాండ్ చేశారు
బీసీలకు ద్రోహం చేసిన వ్యక్తికి టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఎలా ఇస్తుందని ఆయన ప్రశ్నించారు బీసీ సంఘం రాష్ట్ర నేత జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి మాట్లాడుతూ తక్షణమే బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత కోసం కృషి చేయాలని ఆయన కోరారు బీసీ సంఘం మహిళ అధ్యక్షురాలు మనీ మంజరి మాట్లాడుతూ మాధవరెడ్డి నామినేషన్ను తిరస్కరించాలని కోరారు 9 షెడ్యూల్లో అమలు కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేయాలని కోరారు

ఈ సమావేశంలో బీసీ సంఘం రాష్ట్ర నేత బుజ్జ కృష్ణ, డివిటి మల్లయ్య జాదుల లింగయ్య ఈదుగా శ్రీనివాస్ గౌడ్ గజ్జల సత్యనారాయణ సత్యరాజు సాయి ముదిరాజ్ కొప్పుల చందు సంధ్య రాణి నయనం పల్లి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు
