Sunday, September 8, 2024
spot_img

ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకే మట్టి సేకరిస్తున్నాం..

తప్పక చదవండి
  • వెల్లడించిన బీజేపీ నేత సుజనా చౌదరి

ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకే ఏపీలో గ్రామ గ్రామాన తిరిగి మట్టి సేకరిస్తున్నామని బీజేపీ నేత సుజనా చౌదరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మేరీ మాటీ – మేరా దేశ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జాతీయ భావంతోనే మట్టిని సేకరిస్తున్నాం.. బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి అన్నారు. ప్రతి గ్రామం నుంచి మట్టిని సేకరించేందుకు బీజేపీ నేతలు గ్రామాల్లో పర్యటిస్తున్నారని ఆయన చెప్పారు. బీజేపీ అధిష్టానం దేశవ్యాప్తంగా ‘మేరీ మాటీ – మేరా దేశ్’ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని.. జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయం మేరకు ఏపీ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు మట్టిని సేకరించేందుకు ప్రతి గ్రామంలో పర్యటిస్తున్నారని తెలిపారు.
నా భూమి నా దేశం కార్యక్రమంలో భాగంగా వి. సుజనా చౌదరి బీజేపీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామంలో పర్యటించారు. గ్రామంలో బీజేపీ నేతలకు ఘన స్వాగతం లభించింది. భారతీయ జనతా పార్టీ ఆలోచన మేరకు ‘ఏక్ భారత్ – శ్రేష్ట భారత్’ అనే విశ్వాసంతో అందరం కలిసి, అందరి కోసం పనిచేయాలనే భావనతో ఈ కార్యక్రమం చేపట్టామని సుజనా చౌదరి అన్నారు. ‘‘అమృతోత్సవాల్లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మేరీ మాటి – మేరా దేశ్’ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామగ్రామాన పర్యటించి మట్టిని తీసుకుంటున్నాం’ అని గ్రామస్థులకు ఆయన వివరించారు. ‘తరతరాలుగా ప్రజల్లో నాటుకుపోయిన వలసవాద మనస్తత్వ ఆలోచనలను తొలగించి, అభివృద్ధి చెందిన భారతదేశంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేసి భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దటమే నా భూమి – నాదేశం కార్యక్రమం వెనుక ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆలోచన’ అని సుజనా చౌదరి వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సుజనా చౌదరితో పాటు పార్టీ రాష్ట్ర కన్వీనర్ వేటుకూరి సూర్యనారాయణ రాజు, బీజేపీ నేతలు అడ్డూరి శ్రీరాం, భోగవల్లి శ్రీధర్, రామిరెడ్డి, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు