Sunday, September 8, 2024
spot_img

రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బి.ఆర్.ఎస్. పార్టీలో భారీ చేరికలు..

తప్పక చదవండి

హైదరాబాద్ : ఉప్పల్ నియోజకవర్గం, మీర్పేట్ హౌసింగ్ బోర్డ్ డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో బి ఆర్ ఎస్ లో చేరికల పర్వం పెద్ద ఎత్తున కొనసాగుతున్నది. ఎన్టీఆర్ నగర్ చెందిన కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు రాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, ఉప్పల్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, మీర్పేట్ హౌసింగ్ బోర్డ్ కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డిల సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తుందన్నారు.

- Advertisement -

టీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుతారి వాసుచారి, ఎన్టీఆర్ నగర్ కాలనీ అధ్యక్షులు బి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు, పి నరేష్ గౌడ్, ఉపాధ్యక్షులు భీష్మ చారి, ప్రధాన కార్యదర్శి నాగేష్, ఎస్ భాస్కర్, జయమ్మ, లలిత, లక్ష్మి, కమలమ్మ, మరీఅమ్మ, భాగ్యలక్ష్మి, గౌసియా చంద్రకాంత్, పరమేష్ గిరి, నర్సింగ్ రావు, నరసింహ, శ్రీకాంత్, విశాల్, రాములు, బండి యాదయ్య, చెన్నయ్య, రాములు, రాజేష్, 200 మంది కార్యకర్తలు బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు.

ఈ కార్యక్రమంలో మధు ప్రధాన కార్యదర్శి, ఎన్. సుధాకర్ చారి, సంజయ్ జైన్, మల్లేష్ యాదవ్, గజ్జల రాజు, ఎండి రిజ్వాన్, జహీర్, అజీజ్, మదన్, అల్లు, కార్తీక్, రాజ్ కుమార్ గౌడ్, సన్నీ గౌడ్, పవన్, కార్తీక్ రెడ్డి, జితేందర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు