Sunday, September 8, 2024
spot_img

కేసీఆర్‌ ఓడితేనే.. తెలంగాణకు విముక్తి

తప్పక చదవండి
  • గజ్వేల్‌ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌

గజ్వేల్‌ : అభివృధి చేస్తాడు అని నమ్మి ఓటేస్తే నిరుపేదల ప్రజల భూములను లాక్కొని కేసీఆర్‌ రోడ్డుపాలు చేశారని మళ్లీ ఓటేసి మోసపోవద్దు గజ్వేల్‌ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. సోమవారం తూప్రాన్‌ మండల ఇమాంపుర్‌ గ్రామంలో రోడ్డు షోలో భారీ ఎత్తున ప్రజలు, నాయకులు హాజరై గజమాలతో ఈటల రాజేందర్‌ కు స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ మంచి భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ రాజుల బ్రతుకుతున్న రైతుల భూములు తక్కువ ధరకు లాక్కుని వేల కోట్ల కమీషన్ల్‌లు పొందిన దౌర్భగ్యపు ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ అని మండిపడ్డారు.

వ్యవసాయం చేసుకుంటూ పిల్లలను చదివించి కష్టం నమ్ముకున్న వాళ్ళని రోడ్డుపై మొక్కజొన్న కంకులు, పండ్లు అమ్ముకునే దీనస్థితికి కారణం కేసీఆర్‌ కదా అని అన్నారు. ఎన్నడూ లేని బీఆర్‌ఎస్‌ బ్రోకర్‌ లు, నాయకులు ఇప్పుడు వస్తున్నారు, దావత్‌లు ఇస్తారు, కుల సంఘాలతో మీటింగ్‌లు పెడుతున్నారుఅని వారన్నారు మరోసారి వారి భ్రుమలో పడి ఓటేస్తే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉందని అన్నారు. కాయకష్టం చేసి పిల్లలను చదివిస్తే వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా, నోటిఫికేషన్‌ లు వేస్తూ పపేర్‌ లీక్‌ చేస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజలు ఆశీర్వదిస్తే కంటికి రెప్పలా మిమ్మలిని కాపాడుకుంటమని, ఇన్ని రోజులు మోసపోయింది చాలు ఒక్కసారి మీ ఆశీర్వాదం భారతీయ జనతా పార్టీకి అందిస్తే మీ కష్ట సుఖాల్లో ఉంటానని నోటీసులు ఇచ్చిన భూములు తిరిగి వారికే ఇస్తామని హామీనిస్తున్నమని ఈటల రాజేందర్‌ అన్నారు. బీసీ వర్గాలకు కేసీఆర్‌ ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరిగిందని దొరల పాలన నుంచి మనకు విముక్తి సమయం దగ్గరలోనే ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్‌ పార్లమెంట్‌ కన్వీనర్‌ వర్గాంటి రామ్మోహన్‌, రాష్ట్ర సర్పంచుల ఫోరమ్‌ ఉపాధ్యక్షుడు నత్తి మల్లేష్‌, మండల అధ్యక్షుడు మహేష్‌ నరేందర్‌ చారి, అయ గ్రామాల సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు