Sunday, September 8, 2024
spot_img

టీఎస్‌ ఈసెట్‌ తొలి విడుత సీట్ల కేటాయింపు..

తప్పక చదవండి
  • తొలివిడత ఇంజినీరింగ్ లో 82.11 శాతం భర్తీ..
  • ఫార్మసీ విభాగంలో 6.10 శాతం సీట్లు మాత్రమే భర్తీ..
  • ఇంకా 3, 231 సీట్లు మిగిలి ఉన్నాయి..
  • ఈ నెల 12 తేదీ లోపు ఆన్ లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి..

టీఎస్‌ ఈసెట్‌ తొలి విడుత సీట్ల కేటాయింపు జరిగింది. తొలి విడుతలో ఇంజినీరింగ్‌ విభాగంలో 82.11 శాతం సీట్లు భర్తీ కాగా, ఫార్మసీ విభాగంలో 6.10 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈసెట్‌`2023లో 20,895 మంది అర్హత సాధించగా, 12,953 మంది విద్యార్థులు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. 12,880 మంది విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోగా, ఇంజినీరింగ్‌ విభాగంలో 9,606 సీట్లు, ఫార్మసీ విభాగంలో 74 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 3,231 సీట్లు మిగిలి ఉన్నాయి. సెట్‌ ద్వారా ఇంజినీరింగ్‌, ఫార్మసీ సీట్లు పొందిన విద్యార్థులు వెబ్‌సైట్‌ నుంచి అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఈ నెల 12వ తేదీ లోపు ఆన్‌లైన్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి. లేని పక్షంలో సీటు ఆటోమేటిక్‌గా క్యాన్షిల్‌ అవుతుంది. అలాట్‌మెంట్‌ ఆర్డర్‌లో పేర్కొన్న ఫీజును
క్రెడిట్‌ కార్డు లేదా డెబిట్‌ కార్డు లేదా నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఆ తర్వాత సీటు కన్ఫర్మేషన్‌ అవుతుంది. అయితే ట్యూషన్‌ ఫీజు చెల్లించే విద్యార్థులు.. వారి తల్లిదండ్రుల ఖాతా నుంచి చెల్లిస్తే మంచిదని సూచించారు. ఎందుకంటే.. రీఫండ్‌ చేసేందుకు సులభంగా ఉంటుందని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు