Sunday, September 8, 2024
spot_img

శ్రీశైలం ఆలయంలో విశేషమైన పూజలు

తప్పక చదవండి

శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి (కుమారస్వామి) వారికి సోమవారం అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి కృతికా నక్షత్రం, షష్టి తిది, ప్రతి మంగళవారం సందర్భంగా శ్రీసుబ్రహ్మణ్య స్వామికి విశేషాభిషేకం, పూజాధికారులు నిర్వహిస్తున్నారు.
కుమారస్వామికి పూజలు చేయడంతో లోక కల్యాణంతోపాటు ప్రతి ఒక్కరికి ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో ఆటుపోట్లు తొలగిపోయి ఆయా పనులు సక్రమంగా జరుగుతాయి. సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహంతో శత్రుబాధలు, గ్రహ పీడలు, ద్రుష్టి దోషాలు తొలగిపోతాయి. సంతానం కోసం పూజలు చేసే వారికి తప్పక సంతాన భాగ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

ఈ అభిషేకానికి ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి, వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్ని, వాహన ప్రమాదాలు జరక్కుండా ఉండాలని, జనులంతా సుఖశాంతులతో ఉండాలంటూ అర్చక స్వాములు సంకల్పం పఠించారు.
తర్వాత కార్యక్రమం నిర్విఘ్నంగా సాగేందుకు మహా గణపతి పూజ చేశారు. శ్రీసుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం, అర్చన తర్వాత వేద పండితులు, అర్చకులు సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేశారు. సుబ్రహ్మణ్య స్వామి అభిషేకంలో స్వామి వారికి పంచామ్రుతాలైన పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీళ్లు, వివిధ పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. ముఖ్యంగా వివిధ పళ్ల రసాలతో అభిషేకం చేయడం వల్ల ఎంతో ఫలితం ఉంటుందని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు