Sunday, September 8, 2024
spot_img

రూ. 3కోట్ల నగదు పట్టివేత…

తప్పక చదవండి
  • వాడపల్లి సరిహద్దు చెక్‌ పోస్ట్‌ వద్ద కారులో హవాలా సొమ్ము స్వాదీనం..

మిర్యాలగూడ : మిర్యాలగూడ నియోజకవర్గంలోని వాడపల్లి రాష్ట్ర సరిహద్దు చెక్‌ పోస్టులో ఆదివారం తెల్లవారుజామున కారులో తరలిస్తున్న సుమారు మూడు కోట్ల రూపాయల నగదును పోలీసులు పట్టుకున్నారు. పోలింగ్‌ నియమావళిలో భాగంగా పోలీసులు విస్తృతంగా వాహనాలు తనిఖీ చేస్తున్న నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌ నుండి వస్తున్న టిఎస్‌ 10ఎఫ్‌డి 0643 నెంబర్‌ కారును మిర్యాలగూడ శివర్లలో తనిఖీ చేసేందుకు పోలీసులు ఆపినప్పటికీ, సదరు కార్‌ డ్రైవర్‌ కారును వేగంగా ఆపకుండా అద్దంకి- నార్కట్‌ పల్లి హైవేపై మద్రాస్‌ వైపు దూసుకుపోయాడని దీంతో అనుమానం వచ్చిన పోలీసులు కారును వెంబడిస్తూ వాడపల్లి సరిహద్దులో ఉన్న పోలీసులను అలర్ట్‌ చేయడంతో వారు కారును ఆటకాయించి సోదా చేయటంతో భారీగా నోట్ల కట్టలు వెలుగు చూశాయి.డబ్బులను నిందితులను, వాహనాన్ని వాడపల్లి పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. సమాచారం అందుకున్న రూరల్‌ సీఐ సత్యనారాయణ, మిర్యాలగూడ డి.ఎస్‌.పి వెంకటగిరి లు వాడపల్లికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. నగదును హైదరాబాద్‌ నుండి చెన్నై తరలిస్తున్నట్లుగా సమాచారం.నగదును మిషిన్లతోటి లెక్కించి, నల్లగొండ ఎస్పీ కార్యాలయానికి తరలించారు. పట్టుబడిన నగదు మూడు కోట్ల వరకు ఉంటుందని,నగదుకు సంబందించిన సరైన పత్రాలు లేకపోవడంతో హవాలా సొమ్ముగా భావిస్తున్నట్లు సమాచారం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు