Sunday, September 8, 2024
spot_img

కానిస్టేబుల్స్ పాత్ర అమోఘం..

తప్పక చదవండి
  • మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ కె. నరసింహ..

మహబూబ్ నగర్ : నేరస్తులకు శిక్ష పడటానికి, పిపి/ఏపిపీ, కోర్టు లైసెన్ ఆఫీసర్స్, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ తో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు జిల్లా ఎస్.పి కె.నరసింహ మాట్లాడారు.
కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైనదని, నేర రహిత సమాజముగా తీర్చిదిద్దాలంటే నిందితులకు కోర్టులో శిక్షపడే విధంగా కోర్టు పోలీసు సిబ్బంది శ్రమించాలని, ఇందుకోసం ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటి నుండి కేసు పూర్తయ్యేంతవరకు నిందితుల నేరాలను నిరూపించేందుకు అవసరమైన రుజువులు, పత్రాలు, సాక్షుల వాగ్మూలంను కోర్టుకు సమర్పించడంలో కోర్టు కానిస్టేబుల్ ప్రత్యేక శ్రద్ద, బాధ్యత తీసుకోవాలని సూచించారు.

నేరస్తులకు శిక్షలు పడుటకు కోర్ట్ డ్యూటీ పోలీస్ అధికారులు కృషి చేయాలని, కోర్టు డ్యూటీ ఆఫీసర్ లు బాధ్యతాయుతంగా వ్యవహరించి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలని నేరస్థులు శిక్షల నుండి తప్పించుకోకూడదని అన్నారు. అలాగే కోర్ట్, వారెంట్స్ , సమన్స్, ఎంసీలు వర్టికల్స్ గురించి పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న కోర్ట్ కానిస్టేబుల్ అధికారులు తమ విధిలో భాగంగా ఎప్పటికప్పుడు ఎన్.బి.డబ్లూ.(నాన్ బేలబుల్ వారెంటులను) క్రమం తప్పకుండా అమలు పరిచి, నేరస్తులకు శిక్షలు పడేవిధంగా కృషిచేయాలని, కన్విక్షన్ రేటును పెంచాలని అన్నారు. కోర్టు నందు ఎఫ్ఐఆర్ లను సరైన సమయంలో అందించాలని. కేసుల్లో ఉన్నటువంటి ప్రాపర్టీని సరైన సమయంలో కోర్టు నందు డిపాజిట్ చేయాలి. కోర్టులో బాధితులకు న్యాయం జరిగే విధంగా నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషిచేయాలని, నేరస్తులకు వారంట్స్, సమన్స్, సత్వరమే ఎగ్జిక్యూటివ్ అయ్యే విధముగా చర్యలు తీసుకోవాలని, కోర్టు ప్రాసిక్యూషన్ కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు తెలియజేయాలని, కోర్ట్ క్యాలెండర్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, కేసు ట్రయల్స్ సమయములో పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క సలహాలు, సూచనలు పాటించాలని, కోర్టు పెండింగ్ ట్రయల్ కేసులు, వారెంట్స్, సమన్స్, సి.సి.టి.యన్.యస్ లో ( కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ ) లో డాటా ఎంటర్ చేయాలని సూచించారు.

- Advertisement -

కోర్టు నందు ట్రయల్ జరిగిన కేసులు ఎంటర్ చేసినచో పెండింగ్ లేకుండా వుంటుందని తెలిపారు. భాదితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, భాదితులకు మరింత నమ్మకం పెరిగేలా ప్రతి ఒక్క అధికారి పనిచేయాలని సూచించారు. గత నెలలో కేసుల యందు శిక్ష పడేట్లు ప్రతిభ కనపరచిన పిపి, ఏపిపి, కోర్టు లైసన్ ఆఫీసర్స్ కి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు, డీ.ఎస్.పి వెంకట రమణ రెడ్డి, అడిషనల్ పీపీ రంభక్ష్, ఎస్పీ సీసీ రామ్ రెడ్డి, ఇన్స్పెక్టర్ బషీర్, కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్స్, కోర్టు కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు