Sunday, September 8, 2024
spot_img

వందల మంది బలిదానాలు చేస్తే ఒక్క కుటుంబం మాత్రమే సుఖపడుతుంది : పొంగులేటి

తప్పక చదవండి

ఖమ్మం ; తిరుమలాయపాలెంలో ఎన్నికల ప్రచారంలో పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ ప్రచారంలో భాగంగా పొంగులేటి మాట్లాడుతూ ఎంతో మంది కవులు, కళాకారులు, ఉద్యమకారులు, విద్యార్థులు బలిదానం ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రం కేవలం ఒకే ఒక్క కుటుంబం స్వార్ధం కోసం వాడుకుంటోందని పేర్కొన్నారు. 2014కు ముందు కేసీఆర్‌ ఆర్థిక పరిస్థితి ఏంటి?.. గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఆర్ధిక పరిస్థితి ఏంటనేది ప్రజలు ఆలోచించాలని పొంగులేటి పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇంద్రలోకాన్ని చూపిస్తూ తెలంగాణ యాసలో ప్రజలను మభ్య పెడుతుంటాడన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను కాదని రెండు సార్లు కేసీఆర్‌కు అధికారం అప్పగిస్తే ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని ఐదున్నర లక్షల కోట్ల అప్పుల పాలు చేశాడన్నారు. కాళేశ్వరం పేరుతో ఐదున్నర లక్షల కోట్లలో ప్రజల సొమ్ము కేసీఆర్‌ దొంగిలించాడని పొంగులేటి తెలిపారు. అలాంటి కేసీఆర్‌ ను మరోసారి ముఖ్యమంత్రిని చేద్దామా? అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఇచ్చిన హావిూల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే మన కష్టాలు తీరుతాయని పొంగులేటి తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు