Sunday, September 8, 2024
spot_img

కాషాయసంద్రంగా మారిన ఓరుగల్లు గడ్డ

తప్పక చదవండి
  • ఎర్రబెల్లి ప్రదీప్ రావు వెంట కాషాయం జెండా పట్టి కదిలిన ప్రజలు.

వరంగల్ తూర్పు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు శుక్రవారం నామినేషన్ వేసేందుకు గాను భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సమాచార, బ్రాడ్‌కాస్టింగ్ శాఖ, యువజన వ్యవహారాలు, క్రీడా శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వరంగల్ రైల్వే స్టేషన్ నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ ర్యాలీలో వేలాదిమంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారు. బీజేపీ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రదీప్ రావు మాట్లాడుతూ నామీద ప్రేమతో ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు, మీరు నాపై చూపెట్టిన ఈ అభిమానానికి ఎప్పటికీ విధేయుడుగా ఉంటానని మాటిస్తున్నానని తెలియజేశారు. నీకోసం మీలో ఒకడిగా మీ ముందుకు వస్తున్నాను. నా నామినేషన్ కార్యక్రమానికి మీరంతా తరలి రావడమే విజయంగా భావిస్తున్నాను, ఇక మీ ఆశీర్వాదం తో మళ్ళీ గెలిచి మీకోసం వస్తాను అని అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు