Sunday, September 8, 2024
spot_img

ఇంకా సాక్షాలు కావాలా రాహుల్‌ : మంత్రి కేటీఆర్‌

తప్పక చదవండి

హైదరాబాద్‌ : దుబ్బాక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. దాడికి పాల్పడిరది కాంగ్రెస్‌ కార్యకర్త అని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ.. దానిని కప్పిపుచుకునేందుకు నకిలీ ఫొటోలు, వీడియోలతో మభ్యపెట్టేందుకు ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా స్పందించారు. ప్రభాకర్‌రెడ్డిపై దాడిచేసింది కాంగ్రెస్‌ గూండానే అంటూ.. ఆ పార్టీ కండువాతో ఉన్న నిందితుడి ఫొటోలను ఆయన పోస్ట్‌ చేశారు. ఇంకా ఆధారాలు కావాలా అని పార్టీ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు