Sunday, September 8, 2024
spot_img

నా ఫేస్ బుక్ హ్యాక్ చేశారు..

తప్పక చదవండి
  • ఇన్ స్టాగ్రామ్ ను కూడా డిలీట్ చేశారు: రాణి రుద్రమ

హైదరాబాద్ : సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన ఫేస్ బుక్ పేజీ హ్యాక్ అయ్యిందని ఆరోపించారు. హ్యాకింగ్ చేయడం అధికార బీఆర్ఎస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీల సోషల్ మీడియా ఖాతాలను బీఆర్ఎస్ పార్టీ హ్యాక్ చేయిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజలతో మాట్లాడేందుకు, వారితో తన ఆలోచనలని పంచుకునేందుకు సోషల్ మీడియా ఎంతో ఉపయోగపడిందని అన్నారు. 12 ఏళ్లుగా తాను ఫేస్ బుక్ వాడుతున్నానని.. కానీ సోమవారం సాయంత్రం తన ఫేస్ బుక్ ని హ్యాక్ చేసి.. ఇన్ స్టాగ్రామ్ ని డిలీట్ చేశారని.. ఇది ప్రభుత్వ పెద్దల పనే అని మండిపడ్డారు. ఐటీ మంత్రి కేటీఆర్ స్వయంగా ఒక టీమ్ ని స్లీపర్ సెల్స్ గా పెట్టి ఇలా చేపిస్తున్నారని ఆరోపించారు. తాను సిరిసిల్ల నుంచి పోటీ చేస్తున్నానని.. అందుకే కేటీఆర్ భయపడి, ఇలాంటి పనులు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తాను మీడియాతో మాట్లాడుతుండగానే పేస్ బుక్ లో ఎవరో ఫన్నీ వీడియో పోస్ట్ చేశారని చెప్పారు. దీనిపై సైబర్ క్రైమ్ తో పాటు ఎన్నికల కమిషన్ కి పిర్యాదు చేస్తామని తెలిపారు. పోలీసులు అధికార పార్టీ కొమ్ముకాయకుండా ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటున్నానని రాణి రుద్రమ పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు