Sunday, September 8, 2024
spot_img

మల్లారెడ్డి భారీ మెజార్టీతో గెలువడం ఖాయం

తప్పక చదవండి
  • కౌన్సిలర్ తుడుం గణేష్

మేడ్చల్ : మేడ్చల్ నియోజకవర్గం నుండి కార్మికశాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని కౌన్సిలర్ తుడుం గణేష్ తెలిపారు. శుక్రవారం మేడ్చల్ మున్సిపాలిటీ 4వ వార్డులో కౌన్సిలర్ తుడుం గణేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సంధర్భంగా కౌన్సిలర్ తుడుం గణేష్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలతో తెలంగాణ ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మరోసారి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రానుందని మేడ్చల్ నియోజకవర్గం నుండి చామకూర మల్లారెడ్డి భారీ మెజార్టీతో గెలువబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేష్, వైస్ ప్రెసిడెంట్ నరేష్, మధుసూదన్ రెడ్డి, పవన్, సాయి గౌడ్, శ్యామ్ కుమార్, మధు గౌడ్, అరవింద్, సాయి, సూరిబాబు, శివాజీ, ప్రశాంత్, వినయ్, అశోక్, సురేష్, కాశి, మారుతి, శ్రీకాంత్, రాజు, చింటూ కాళీ, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు