Sunday, September 8, 2024
spot_img

గుండెపోటుతో సింహం మృతి

తప్పక చదవండి

విశాపట్నం : విశాఖ లోని ఇందిరాగాంధీ జూలాజికల్‌ పార్క్‌లో పద్దెనిమిదేళ్ల ఆడ సింహం మృతిచెందింది. వృద్దాప్యం కారణంగా గుండెపోటుతో మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. చనిపోయిన సింహం పేరు మహేశ్వరి. వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ సమర్పించిన పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం…వృద్దాప్యం కారణంగా మయోకార్డియల్‌ ఇన్‌ ఫ్రాక్షన్‌ (గుండెపోటు) కారణమని వైజాగ్‌ జూ క్యూరేటర్‌ నందనీ సలారియా తెలిపారు. 2006లో సింహం (మహేశ్వరి) జన్మించింది. 2019లో గుజరాత్‌లోని సక్కర్‌బాగ్‌ జూపార్క్‌ నుండి వైజాగ్‌ జూకి తీసుకువచ్చారు. ఇక అప్పటి నుంచి ఇదే జూలో ఉంటోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు