Sunday, September 8, 2024
spot_img

ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి కేసిఆర్ కు ముందే తెలుసు – ఈడి

తప్పక చదవండి

హైదరాబాద్ : ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ స్కాం గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ముందుగానే కేసీఆర్‌కు చెప్పారని ఈడీ సంచలన విషయం వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలోనే తన టీమ్ సభ్యులు బుచ్చిబాబు, అభిషేక్, అరుణ్ పిళ్లైలను కవిత తన తండ్రికి పరిచయం చేసినట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. కవిత పరిచయం చేసిన వారి నుంచి కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారని, ఆ తర్వాత బుచ్చిబాబు సమీర్ మహేంద్రను కేసీఆర్‌కు పరిచయం చేసినట్లు చెప్పారు. కవిత తన నాలుగు ఫోన్లలోని ఆధారాలను ధ్వంసం చేశారని ఈడీ కోర్టు దృష్టికి తీసుకు వచ్చింది. ఈ బెయిల్ పిటిషన్లపై ఈరోజు వాదనలు ముగియడంతో హైకోర్టు జడ్జి తీర్పును రిజర్వ్ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు