Sunday, September 8, 2024
spot_img

పోస్టల్ బ్యాలెట్ కోసం నవంబర్ 7లోపు ఫారం-12(డి) సమర్పించాలి..

తప్పక చదవండి
  • జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగమ : పోస్టల్ బ్యాలెట్ కోసం అవకాశం కలిగి ఉండి, దానిని వినియోగించదల్చిన వారు నవంబర్ 7 వ తేదీ లోపు నిర్ణీత ఫారం-12(డి) భర్తీ చేసి సంబంధిత నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అందజేయాలని, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య, శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 80 సంవత్సరాల వయస్సు పైబడిన సీనియర్ సిటిజన్లకు, 40 శాతానికి పైగా వైకల్యం కలిగిన దివ్యంగులకు, కోవిడ్ పాజిటివ్ కలిగిన వారికి ఇంటి నుండే ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు ఉందన్నారు. అదే విధంగా అత్యవసర సర్వీసులకు చెందిన వారికి ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించిందన్నారు. నవంబర్ 7వ,తేదీ లోపు రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో సమర్పించే ఫారం -12 (డీ)లను మాత్రమే పరిగణలోకి తీసుకుని పోస్టల్ బ్యాలెట్ కు అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఫారం -12 (డీ) దరఖాస్తులు నోడల్ అధికారి నుండి రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల నుండి పొందవచ్చని, ఎన్నికల సంఘం పోర్టల్ నుండి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారు సంబంధిత ఆర్.ఓ కార్యాలయానికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ప్రత్యేకంగా పోస్టల్ ఓటింగ్ సెంటర్ (పీవీసీ) అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కోసం నిర్ణీత ఫారం ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం ఇవ్వరని, ఓటరు జాబితాలో వారి పేరును పోస్టల్ బ్యాలెట్ కింద మార్కింగ్ చేయబడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు