Sunday, September 8, 2024
spot_img

అరంగేట్రంలోనే రాణించిన జైస్వాల్‌

తప్పక చదవండి
  • అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీతో రికార్డు
    న్యూఢిల్లీ : యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్‌ (116 బ్యాటింగ్‌) అంతర్జాతీయ క్రికెట్‌లో తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టడంతో పాటు..తొలి టెస్టు ఆరంభంలోనే సెంచరీ బాదాడు. ఆడుతున్న తొలి టెస్టులోనే శతకం బాదేసి వహ్వా.. అనిపించాడు. భారత టెస్టు చరిత్రలో అరంగేట్రంలో విదేశీ గడ్డపై శతకం బాదిన ఓపెనర్‌గా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. సంయమనం, నిలకడ, దూకుడు కలబోసిన ఆటతీరుతో తను కరీబియన్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొని సుదీర్ఘ సమయం క్రీజులో నిలిచాడు. అటు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (103) కూడా చాలా రోజుల తర్వాత బ్యాట్‌కు పనిచెబుతూ శతకం సాధించి జట్టు భారీ స్కోరుకు దోహదపడ్డాడు. ఫలితంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ టీ విరామ సమయానికి 81 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. అంతకుముందు విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌటైంది. నిదానంగా ఆరంభం: తొలి రోజు బుధవారం ఆఖరి సెషన్‌లో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ఆట ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 80 పరుగులతో నిలిచింది. ఓపెనర్లు యశస్వీ, రోహిత్‌ విండీస్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొ ంటూ క్రీజులో నిలిచారు. అరంగేట్ర హీరో యశస్వీ కరీబియన్‌ గడ్డపై ఆత్మవిశ్వాసం కనబర్చాడు. ఆడుతోంది తొలి టెస్టు అనే భావన కనిపించనీయలేదు. అటు రోహిత్‌ కూడా చాలా రోజుల తర్వాత ఆకట్టుకున్నాడు. అయుతే గురువారం ఆటలో మాత్రం తొలి రోజు మాదిరి వేగం కనిపించలేదు. స్లో పిచ్‌ కావడంతో స్పిన్నర్లు కార్న్‌వాల్‌, వారికన్‌ సుడులు తిరిగే బంతులతో విసిగించారు. దీంతో మొదటి సెషన్‌ 32 ఓవర్లలో 66 పరుగులు మాత్రమే వచ్చాయి. కానీ ఓపిగ్గా క్రీజులో నిలిచిన ఓపెనర్లు రోహిత్‌, యశస్వీ అర్ధసెంచరీలు సాధించి వికెట్‌ను కోల్పోకుండా లంచ్‌ విరామానికి వెళ్లారు. రెండో సెషన్‌ ఆరంభంలో భారత్‌ ఆటలో జోరు పెరిగింది. యశస్వీ, రోహిత్‌ అడపాదడపా ఫోర్లు రాబట్టడంతో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. ఇదే జోరుతో మొదట జైస్వాల్‌ తొలి శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అటు మరింత ఓపిగ్గా ఆడిన రోహిత్‌ చక్కటి ఫోర్‌తో టెస్టుల్లో పదో శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే మరుసటి బంతికే అథనజె అతడి వికెట్‌ తీయడంతో తొలి వికెట్‌కు 229 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. వన్‌డౌన్‌ వచ్చిన గిల్‌ (6) వారికన్‌ బౌలింగ్‌లో అథనజెకు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. వెస్టిండీస్‌పై భారత్‌ తరఫున తొలి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం (229) అందించిన రోహిత్‌`యశస్వీ జోడీగా నిలిచింది.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు