Sunday, September 8, 2024
spot_img

ఇస్రో సన్ మిషన్..

తప్పక చదవండి
  • భూమి చంద్రుడి ఫోటోలు పంపించిన ఆదిత్య ఎల్ 1
  • భూ కక్ష్యలో తిరుగుతున్న ఆదిత్య మిషన్..
  • క్రమంగా ఆదిత్య కక్షను పెంచిక్కుతున్న ఇస్తో శాస్త్రవేత్తలు..
  • 15 లక్షల కిమీ ప్రయాణించి ఎల్. వన్ పాయింట్ కు చేరుకోనున్న ఆదిత్య..

బెంగుళూరు : సూర్యుడిని పరిశోధించేందుకు భారత్‌ పంపించిన ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహం లక్ష్యం దిశగా విజయవంతంగా ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో ఆకాశం నుంచి ఫొటోలు, సెల్ఫీ పంపించింది ఈ ఉపగ్రహం. ఆకాశం నుంచి తీసిన ఒక ఫొటోలో మన భూగ్రహంతో పాటు తొంగి చూస్తున్నట్టు చందమామ కూడా కనిపించాడు. ఆదిత్య ఎల్ 1 ఆప్‌డేట్స్‌లో భాగంగా ఆ ఫొటోను ఇస్రో షేర్ చేసింది. ఈ సెల్ఫీ ఫొటోలను సెప్టెంబర్‌ 4న ఆదిత్య ఎల్‌-1 లోని కెమెరా క్యాప్చర్‌ చేసింది. ఈ ఫొటోలో ఆదిత్య ఎల్‌ 1లో ఉన్న విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరొనాగ్రాఫ్‌ వీ.ఈ.ఎల్.సి., సోలా ఆల్ట్రా వయోలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌ -షూట్ పే- లోడ్స్‌ స్పష్టంగా కనిపించాయి. భూమి, చంద్రుడు ఒకేసారి కనిపించిన దృశ్యాలను కూడా ఆదిత్య ఉపగ్రహంలోని కెమెరా క్లిక్‌మనిపించింది. సూర్యుడిని పరిశోధించేందుకు ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ను భారత్‌ సెప్టెంబర్‌ రెండున ప్రయోగించింది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని సూర్యుడి సమీపంలోని ఎల్‌-1 పాయింట్‌కు చేరేందుకు ఉపగ్రహానికి 125 రోజుల సమయం పడుతుంది. ఈ ఎల్‌ వన్‌ పాయింట్‌ నుంచి సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేయవచ్చు. ఆదిత్య ఎల్‌ -1 మొత్తం ఏడు పరిశోధనా పరికరాలున్నాయి. ఇవి సూర్యుడి పొరలతో పాటు వెలుపల ఉండే కరోనానూ కూడా అధ్యయనం చేస్తాయి. సౌరజ్వాలలు, సౌర రేణువులు, సూర్యుడి సమీపంలో ఉండే వాతావరణం వంటి ఎన్నో అంశాలను ఆదిత్య మిషన్‌ శోధించనుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు