Sunday, September 8, 2024
spot_img

అఫ్గాన్‌లో భారీ భూకంపం

తప్పక చదవండి
  • 15 మంది మృతి..
  • భయంతో జనం పరుగులు
    హెరాత్‌ ప్రావిన్స్‌ : అఫ్గానిస్థాన్‌?లో సంభవించిన భూకంపంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి గాయాలయ్యాయి. 6.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. హెరాత్‌ ప్రావిన్స్‌?లో ఈ భూకంపం సంభవించింది. శనివారం మధ్యాహ్నం సమయంలో భూకంపం వచ్చినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. కనీసం ఐదు శక్తిమంతమైన భూకంపాలు సంభవించినట్లు వెల్లడిరచారు. హెరాత్‌?కు 40 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడిరచింది. 6.3 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయని తెలిపింది. అనంతరం 5.5 తీవ్రతతో మరో భూకంపం వచ్చిందని వివరించింది. భూకంపాల తీవ్రతను చూపించే మ్యాప్‌?ను సైతం విడుదల చేసింది అమెరికా. ‘‘ప్రజలందరూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దుకాణాలు అన్నీ ఖాళీ అయ్యాయి. మళ్లీ భూకంపం సంభవిస్తుందేమోనని ప్రజలు భయపడుతున్నారు. నేను నా కుటుంబం ఇంట్లో ఉన్నాం. ఒక్కసారిగా ప్రకంపనలు వచ్చాయి. వెంటనే నా కుటుంబ సభ్యులు అరుస్తూ బయటకు పరుగులు తీశారు. ఇంట్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారని అబ్దుల్‌ సకార్‌ సమది, ప్రత్యక్ష సాక్షి అన్నారు. ఈ ఘటనపై తాలిబన్‌ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎంత మంది చనిపోయారు, ప్రాణ, ఆస్తి నష్టంపై అధికారికంగా వివరాలు వెల్లడిరచలేదు. టెలిఫోన్‌ కనెక్షన్లు తెగిపోవడం వల్ల ఆయా ప్రాంతాల్లో ఎంత నష్టం సంభవించిందనేది తెలియడం లేదు. సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైన వీడియోల ప్రకారం.. వందలాది మంది అఫ్గాన్‌ పౌరులు బయటకు పరుగులు తీశారు. ఇటీవల మొరాకోలో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 2,862 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. మర్రాకేష్‌, చిచౌవా, టరౌడెంట్‌ ప్రాంతాల్లో భూకంప తీవ్రత ఎక్కువగా కనిపించింది. ఇళ్లు, భవనాలు పూర్తిగా దెబ్బతినడం వల్ల ప్రజలు రహదారులపైనే గడిపారు. టూరిజానికి ప్రఖ్యాతి గాంచిన మర్రకేష్‌ నగరం తీవ్రంగా దెబ్బతింది.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు