Sunday, September 8, 2024
spot_img

గత మూడు రోజుల నుండి పెరుగుతున్న బంగారం ధరలు

తప్పక చదవండి

పసిడి ప్రియులకు బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. వరుసగా మూడో రోజు గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగాయి. అంతర్జాతీయంగానూ ధరలు భారీగా
బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ధరలు షాకిస్తున్నాయి. ఆగస్టు ప్రారంభంలో వరుసగా పడిపోయిన గోల్డ్ రేట్లు గత మూడు రోజులుగా పెరుగుతున్నాయి. వరుస సెషన్లలో పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయమే. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ మొదలైపోయింది. దీంతో బంగారం, వెండి డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో ధరల పెరుగుదల అదనపు భారమనే చెప్పాలి. అయినప్పటికీ తులం గోల్డ్ రేటు రూ. 60 వేల లోపే ఉండడం ఓ వైపు ఆలోచిస్తే ఇప్పటికీ మంచి అవకాశమనే చెప్పాలి. ప్రస్తుతం మన హైదరాబాద్, ఢిల్లీలో గోల్డ్ రేటు తులానికి ఎంత పలుకుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

గ్లోబల్ మార్కెట్లో ధరలు పైపైకి..

- Advertisement -

అంతర్జాతీయ మార్కెట్లో చూసుకుంటే ధరలు భారీగా పెరుగుతున్నాయి. పసిడి వైపు పెట్టుబడులు పెరగడం, డిమాండ్ పుజుంకోవడం ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఇవాళ 1919 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం సెషన్‌తో పోలిస్తే ఏకంగా 25 డాలర్ల మేర పెరిగింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు ఇవాళ 24.31 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

హైదరాబాద్‌లో పెరిగిన గోల్డ్ రేటు..
మన హైదరాబాద్ మార్కెట్లో చూసుకుంటే వరుసగా మూడో రోజు గోల్డ్ రేట్లు పెరిగాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ తులానికి రూ. 100 పెరిగి ప్రస్తుతం రూ. 54 వేల 300 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైనగోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 100 పెరిగింది. ప్రస్తుతం తులం రేటు రూ. 59 వేల 230 వద్ద ట్రేడవుతోంది. ఇక ఢిల్లీలో చూస్తే 22 క్యారెట్ల్ గోల్డ్ రేటు ఇవాళ రూ. 150 పెరిగి రూ. 54 వేల 450 మార్క్ వద్దకు చేరింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఢిల్లీలో ఇవాళ రూ. 180 పెరిగి తులానికి రూ. 59 వేల 400 వద్దకు చేరింది.

రూ.500 పెరిగిన వెండి..
వెండి ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. మన హైదరాబాద్ బులియన్ మార్కెట్లో చూసుకుంటే రెండు రోజుల్లోనే కిలో వెండి ధర రూ. 2000 పెరిగింది. ఇవాళ కిలోపై రూ. 500 పెరిగగా ప్రస్తుతం కిలో రటు రూ. 78 వేల 500 మార్క్‌కు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి రేటు ఇవాళ రూ. 500 పెరిగి రూ. 75 వేల 300 పలుకుతోంది. హైదరాబాద్‌లో వెండి రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. బంగారం మాత్రం ఢిల్లీతో పోలిస్తే తక్కువకే లభిస్తుంది. అందుకు ఆయా ప్రాంతాల్లోని ట్యాక్సులు, ఇతర అంశాలు కారణంగా మారతాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు