Sunday, September 8, 2024
spot_img

జనగామలో కాంగ్రెస్ కార్యకర్తల ఇంటింటి ప్రచారం

తప్పక చదవండి
  • ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి గెలుపునకై కృషి

జనగామ : జనగామ పట్టణం 2వ వార్డు, 3వ వార్డు, 5వవార్డు, 9వ వార్డు 19వ వార్డులో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ, పార్టీ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం 2వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాంరెడ్డి, సంజీవ రెడ్డి, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ యువనాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ చెంచరపు శ్రీనివాస్ రెడ్డి, జనగామ మున్సిపల్ మాజీ చైర్మన్ వేమళ్ళ సత్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చరాబుడ్ల రాందయాకర్ రెడ్డి, 9th వార్డు కౌన్సిలర్ ముస్త్యాల చందర్, దోర్నాల వెంకటేశ్వర్లు , ఏల జనార్దన్, 9వ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మునిబేగం, రంగు రవి, దోర్నాల రమేష్, కోట నాయక్, గందమల్ల కమలాకర్, మణిదిప్, మచ్చ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు