Sunday, September 8, 2024
spot_img

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం ..

తప్పక చదవండి

డబ్బు మదంతో ప్రజాస్వామ్యానే కొంటాం అంటున్నారని కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లా పాలేరు జీళ్ల చెరువులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొన్నారు. పొంగులేటి పేరును ప్రస్తావించకుండానే సీఎం కేసీఆర్‌ ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ జిల్లాలో ఒకరిద్దరు ఇద్దరు బహురూపుల నాయకులు ఉన్నారు. వాళ్లకు డబ్బు అహంకారం. డబ్బుతో మేం ఎవరినైనా కొనుగోలు చేయగలం. ఏదైనా చేయగలం అని అహంకారంతో మాట్లాడుతున్నారు. ఆ నాయకులు ఎవరు? పాలేరులో నిలబడాలని ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వాలికి కూడా తొక్కనివ్వమని మాట్లాడుతున్నారు. మీరందరు అనుకుంటే దుమ్ములెవ్వదా? నోట్ల కట్టలు.. డబ్బుల కట్టల అహంకారంతో నాలుగు పైరవీలు, కాంట్రాక్టులతో సంపాదించి.. డబ్బు మదంతో ప్రజలనే కొంటం.. ప్రజాస్వామ్యానే కొంటం అనే అహంకార పూరిత మాటలు మాట్లాడుతున్నారు. ఇది రాజకీయమా? దీన్ని రాజకీయం అనుకోవచ్చునా? ఇవాళ కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి.. మీ ఓట్లు తీసుకొని ఏమారిస్తే.. అదే చేయిపెట్టి కడుపులోని పేగులు లాగుతరు. ఆ మాట మరిచిపోతిమా దెబ్బతింటాం.. ఎటుకాకుండా పోతాం జాగ్రత్త అని మనవి చేస్తున్నా’ అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు