Sunday, September 8, 2024
spot_img

15 రోజులుగా చీకట్లోకి వెళ్ళిపోయిన సీఎం కేసీఆర్..

తప్పక చదవండి
  • ఎద్దేవా చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..

హైదరాబాద్ : 15 రోజులుగా కేసీఆర్ చీకట్లోకి వెళ్ళిపోయారు.. కేసీఆర్ పాలన చూస్తే తెలంగాణ ఎందుకు వచ్చిందని బాధగా అనిపిస్తుంది అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. ఆయన హైదరాబాద్ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంగంట్లో అమ్మకానికి పెట్టిన సరకుగా మారింది.. రాష్ట్రంలో భార్యాభర్తలు కలిసి సంసారం చేయలేకపోతున్నారు.. కేసీఆర్ కి నైతికత ఉంటే సీఎం పదవి నుండి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటుంది.. మెగా డీఏఎస్సీ కోసం విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.. తెలంగాణ ఏర్పాటులో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల పాత్ర గొప్పది.. ఉద్యమకారులను వివక్షకు గురిచేయడమే లక్ష్యంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు.. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 1.90 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి.. 5 శాతం ఐఆర్ నిర్ణయాన్ని ప్రభుత్వం పున:పరిశీలించాలి.. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 20 శాతం ఐఆర్ ప్రకటించాలి.. ఉద్యోగులకు రావాల్సిన మూడు పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలి.. కాంగ్రెస్ ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ ఉంటుంది అన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు