Sunday, September 8, 2024
spot_img

కేంద్రప్రభుత్వ నూతన చట్ట సంస్కరణలు,కలగబోయే ప్రయోజనాలు

తప్పక చదవండి

నూతన చట్టాలతో భారత పౌరులకు సత్వర న్యాయం సిద్ధించాలి. పౌర హక్కులు రక్షించబడాలీ అని కేంద్ర ప్రభుత్వం కోరుకుం టుంది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, లోక్‌ సభలో ప్రకటించారు.అందుకు అనుగుణంగా అగస్టు11, 2023 (శుక్రవారం) లోక్‌ సభలో ప్రవేశపెట్టిన ఈ నూతన బిల్లుల వల్ల భవిషత్తులో అనేక మార్పులు రానున్నాయి. 164 ఏళ్ల క్రితం థామస్‌ మెకాలే రూపొంధించిన ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ నే మనం ఇంతకాలంఉపయోగిస్తూ వచ్చాం.కాంగ్రెస్‌ హయాంలో 1973లో క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో కొన్ని మార్పులు ప్రవేశపెట్టినా అవి నామమాత్రమే. 1898లో బ్రిటిష్‌ కాలంలో రూపొందించబడిన క్రిమినల్‌ చట్టాలనే ఇంతకాలం అనుసరిస్తూ వచ్చాం.కాలాను గుణంగా వాటిని మార్చింది లేదు. ఆనాటి చట్టాలు బ్రిటిష్‌ వారు, వారి పరిపాలనా సౌలభ్యం కోసం రూపొందించి కొన్నవే.మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెంటనే మొత్తం న్యాయ వ్యవస్థ లో పాత చట్టాలను సంస్కరించి,నూతనంగా తిరిగ రాసేందుకు దేశంలోని న్యాయం నిపుణులకు ఈ బాధ్యతలు అప్పగించింది. కొన్నేళ్ళ కృషి తర్వాత, ఈ న్యాయ సంహితకు సంబంధించిన చట్టాల నమూనా రూపొం దించారు. సమకాలీన సామాజిక, ఆర్థిక, రాజకీయ,సాంస్కృతిక మార్పులకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు తెచ్చారు. ఇంతకాలం నేరస్తులు శిక్ష పడకుండా స్వేచ్ఛగా తిరుగుతూ, మరిన్ని నేరాలకు పాల్పడుతున్న సామాజిక అస్థిర స్థితిని మనం ఇంతకాలం చూస్తూనే ఉన్నాము.ఆ ముష్క రులు అశాంతికి, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న ధోరణలను మనం రోజూ మీడియాలో చూసేదే. వీటిని అరికట్టాలంటే చట్టంలో లోపాలు సవరించి, పోలీసు, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు జరగితీరాలి.
పాతచట్టాల పేర్లలో మార్పు, ఇతర విషయాల్లో తీసుకొచ్చిన కొత్త మార్పులను గమనించాలి అవి:1. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ స్థానం లో చేయబోయే కొత్త చట్టం ‘‘భారతీయ న్యాయ సంహిత ‘‘ 2023 బిల్లును తీసుకొచ్చింది.2. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ స్థానాల్లో కొత్త చట్టం’ భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత’’ 2023 బిల్లును తెచ్చింది. 3వది, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ స్థానాల్లో కొత్త చట్టం’’ భారతీయ సాక్ష్య సంహిత బిల్లు’’ 2023ను రూపొందిం చింది. ఈ 3 బిల్లులనుమరింత లోతుగా పరిశీలన జరపి లోపర హితంగా చూడటం కోసం పార్లమెంటరీ ప్యానల్‌ కు పంపను న్నట్లు కేంద్ర హోం మంత్రి అమీత్‌ షా లోక్‌ సభలో వెల్లడిర చారు. ఇప్పటి వరకు, పాత కాలం నాటి చట్టాలు నేరస్తులను శిక్షించడమే తప్ప న్యాయం చేయడంలో విఫలమై నాయి. కేసులు విచారణలో అనవసరమైన, అంతులేని జాప్యాన్ని అరికట్టి,సత్వర న్యాయం కలిగించే ఉద్దేశంతో ఈ కొత్త చట్టాలను రూపొందిం చారు. న్యాయ ప్రక్రియలో సరళతర విధానాలను ప్రవేశపెట్టారు. కాలం చెల్లిన వాటిని రద్దుచేసారు.సాక్షాలను సమన్వయపరచి,శిక్ష పడాల్సిన వారు తప్పించుకోకుండా చూడటం.పిల్లలు, స్త్రీలపట్ల జరిగే నేరాలను తీవ్రంగా పరిగణించడం.దేశ వ్యతిరేక కార్యకలా పాలను ఉక్కుపాదంతో అణిచివేయడం.ఈ చట్టాల లక్ష్యంగా ప్రక టించారు. వీటిల్లో చట్టపరమైన అంశాలు, వ్యవస్థ పనితీరు, నిర్వాహణా అంశాలు చర్చకు వస్తాయి. 75 సంవత్సరాలుగా రాజ్యాంగాన్ని పలుమార్లు మార్చినా న్యాయ వ్యవస్థ తీరుతెన్నుల్లు ఏమాత్రం మార్పులు రాలేదు.ఇప్పటికే దాదాపు 5 కోట్ల కేసులు వివిధ కోర్టులో పెండిరగ్‌ లో ఉన్నాయి.స్త్రీలపై సామూహిక అత్యా చారాలు, ప్రజల ఆస్తుల విధ్వంసాలు,పిల్లల పట్ల క్రూరంగా వ్యవ హరించడం వంటి ఘోరమైన నేరలకు పాల్పడిన వారుసైతం తప్పించుకొని తిరుగుతూ ఉంటే, అమాయకులు జైళ్ళలో మగ్గుతు న్నారు. అమాయకులను కాపాడి నేరస్తులను శిక్షించాల్సిన న్యాయ వ్యవస్థ న్యాయమూర్తుల కొరత,సిబ్బంది కొరతలతో నత్త నడకన నడుస్తుంది.కేసులతీరు,కేసుల సంఖ్య ఆధారంగా ఇంకా అనేక ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చేయవలసిఉంది.కోర్టులు పనిచేసే వేళలు,పనిగంటలు నిర్ణయించాలి.కోర్టుల సెలవులపై సమీక్ష జరపాలి. చిన్నచిన్న నేరాలుకు పాల్పడిన అభాగ్యులు విచారణ జాప్యంతో దీర్గ కాలం శిక్షలు అనుభవిస్తున్నారు. ఇకమీదట అలా జరగకుండా చూడాలని మోదీ ప్రభుత్వం భావిస్తుంది. దీనికి తోడు ఈచట్టాల్లో డిజిటల్‌ ఎలట్రానిక్‌ సాక్షానికి (ఆడియో,వీడియో) లకు కూడా వీలు కల్పించారు.నేరం ఎక్కడ జరిగినా,ఏ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్నా కేసులు రిజిష్టరు చేసుకోవచ్చు.ఎక్కడైనా జీరో ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలు చేయవచ్చు. ముఖ్యంగా,ప్రజలే ఈ ఎఫ్‌.ఐ. ఆర్‌.ను ఆన్‌ లైన్‌ లో కూడా దాఖలు చేసేందుకు అనుమతించడం వంటి వినూత్న ప్రతిపాదనలు ఈ చట్టాల్లో ఉన్నాయి. అంతేకాదు, దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహించవలసి వస్తే సాక్షాలు బలంగా, పారదర్శకంగా ఉండేందుకు ఆ సోదాలను వీడియో రికార్డు చేస్తారు. ఒకవేళ నేరస్తులు దొరకున్నా,లేదా తప్పించు కున్నా, విచారణ ప్రక్రియ ఆగదు.వారి ఆస్తులు జప్తు చేస్తారు. బ్యాంక్‌ లావాదేవీలు నిలిపివేస్తారు. మూడేళ్లలో న్యాయం అందించేందుకు నిబంధనలను విధించడం వంటివి న్యాయ వ్యవస్థ వేగంగా పనిచేసేందుకు దోహదం చేస్తాయి. డిజిటల్‌ సాంకేతికత వల్ల కేసుల ఫైల్‌ ట్యాంపరింగ్‌ జరిగే అవకాశం ఉండదు. సాక్ష్యాలు నిర్ధారించడం సులభతరం అవుతుంది. లైంగిక హింసకు గురైనటువంటి ఒక స్త్రీ వాంగ్మూలాన్ని ఆమె నివాసంలోనే మహిళా మెజిస్ట్రేట్‌ రికార్డు చేయటమే కాక, ఆమె పేరు బయట పెట్టడాన్ని శిక్షార్హంగా చేశారు. మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తారు.మరణశిక్షలు విధించవచ్చు. 3 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే నేరాలకు పాల్పడిన వారిని డీ.యస్‌.పీ స్థాయి అధికారి అనుమతి లేకుండా అరెస్టు చేయడానికి ఇకపై అవకాశం ఉండదు.దీనివల్ల అభాగ్య్ను లను ఇష్టానుసారం అరెస్ట్‌ చేయడానికి వీలు ఉండదు.అరెస్ట్‌ అయిన సమాచారాన్ని ఇకపై దాచిపెట్టకుండా సరైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయవలసి ఉంటుంది.ప్రతి జిల్లాలో,ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో అరెస్టుకు బాధ్యత వహించేందుకు,అరెస్ట్‌ అయిన వారి వివరాలను వారి కుటుంబ సభ్యులకు తెలియజేసేందుకు ప్రభుత్వాలు ఒక అధికారిని నియమించాల్సి ఉంటుంది. ఏ బాధితుడికైనా దర్యాప్తు ప్రగతిని 90 రోజుల్లోపు చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. ఒక కేసులో దర్యాప్తు140 రోజుల్లో పూర్తి చేసి, చార్జిషీటును 90 రోజుల్లోపు దాఖలు చేయవలసి ఉంటుంది. న్యాయాధికారులు చార్జిషీట్‌ దాఖలైన వెంటనే 60 రోజుల్లో కోర్టు ఆరోపణలను నిర్ధారించి, విచారణ జరిపి 30 రోజుల్లో తీర్పును వెలువరించాల్సి ఉంటుంది. ఏడు రోజుల్లో తీర్పు కాపీని ఆన్‌ లైన్‌ లో అప్లోడ్‌ చేయాల్సి ఉంటుంది. తమ గరిష్ట శిక్షలో సగానికి పైగా శిక్ష అనుభవించిన విచారణలో ఉన్న ఖైదీలకు ఎవరి ప్రమేయం లేకుండానే బేయిలు లభిస్తుంది. ఇక తరచూ వాయిదాలు కోరకుండా వాయిదాల సంఖ్య పరిమితం చేశారు. వేరే కోర్టులో విచారణ ఉన్నదని వాయిదా కోరి, కేసును ఆలస్యం చేయటానికి ఇకమీదట వీలుండదు. సాక్షుల భద్రతకు కూడా కొత్త చట్టాల్లో కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఎఫ్‌.ఐ.ఆర్‌. చార్జిషీట్‌ నుంచి కోర్ట్‌ తీర్పుల వరకు అన్నీ, ఇక డిజిటల్‌ రూపంలోనే డాక్యు మెంట్లు ఉంటాయి. వాద, ప్రతివాదాల వివరాలు పొందేం దుకు ఇరు పక్షాలకూ వీలు కల్పించారు. ఈ కొత్త చట్టాలనుపార్లమెంట్‌ సెలక్ట్‌ కమిటీ పరిశీలించి అభ్యుదయ లక్షణాలు తీసుకు రావడంలో మేధావులు,న్యాయనిపుణులు, సామాజిక, ఆర్థిక, శాస్త్రవేత్తల సలహాలు కోరవచ్చు.ఈ నూతన చట్టాలతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలని ఆశిద్ధాం.ఈ నూతన చట్టాల్లో ప్రజలు స్వాగతించ వలసిన అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు