Sunday, September 8, 2024
spot_img

ఆర్ధిక సాయం చేసిన బీ.ఆర్.ఎస్. నాయకులు నాగపురి కిరణ్ కుమార్..

తప్పక చదవండి

జనగామ జిల్లా కేంద్ర గణేష్ వాడ నిరుపేద పద్మశాలి సామాజికవర్గానికి చెందిన కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు బీ.ఆర్.ఎస్. రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ .. జనగామ జిల్లా కేంద్రం, గణేష్ వాడ ప్రాంత నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన చింతకింది శ్రీనివాస్ అనారోగ్యంతో మరణించారు. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న బీ.ఆర్.ఎస్. రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ భాదిత గృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, కుటుంబ దీనస్థితిని చూసి 10,000 రూపాయల వ్యక్తిగత ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.. ఈ కార్యక్రమంలో 18వ వార్డు అధ్యక్షులు ఆకునూరి వెంకన్న, బీ.ఆర్.ఎస్. నాయకులు ఆలేటిజహంగీర్, వికలాంగుల జిల్లా అధ్యక్షుడు మేకల సమ్మయ్య, వికలాంగుల మహిళ అధ్యక్షురాలు బోట్ల సుమతి, చింతకింది సత్యనారాయణ, అశోక్, మాదాసు శ్రీకాంత్, చింతకింది యాదగిరి, బాల లక్ష్మి, స్వప్న, రాణి, ఉదయ్, సాయి తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు