Sunday, September 8, 2024
spot_img

అధికార పార్టీకి వ్యతరేకంగా తుంగతుర్తిలో బీజేపీ నిరసన..

తప్పక చదవండి

హైదరాబాద్ :
సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గంలో గడచిన తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అరాచక రాజకీయాలు, దోపిడీ, దాడులు, భూకబ్జాలతో మొదలై రాజకీయ మాఫియాకు తుంగతుర్తి నియోజకవర్గం అడ్డాగా మారిందని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా ధ్వజమెత్తారు. శుక్రవారం నాడు స్థానిక తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో సాయిబాబా ఆధ్వర్యంలో నిరసన దీక్షకు ప్రయత్నించారు.

తమ నిరసన దీక్ష సక్సెస్ కాకుండా ఉండేందుకు గాను అధికార పార్టీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కావాలని ఇక్కడ బైక్ ర్యాలీ ఏర్పాటుకు పోలీసుల అనుమతి కోరడంతో, పోలీసులు ఒకే చోట రెండు రాజకీయ పార్టీల కార్యక్రమాలు జరిగితే లా అండ్ ఆర్డర్ కు ఇబ్బంది అనే సాకులు చూపి, తాము చేపట్టిన నిరసన దీక్ష జరగకుండా పగడ్బందీగా ప్లాన్ చేశారని సాయిబాబా పేర్కొన్నారు. అయినప్పటికీ సాయిబాబాతో పాటు బిజెపి పార్టీ శ్రేణులు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టే ప్రయత్నం చేయబోగా స్థానిక పోలీసులు బిజెపి నాయకులను, సాయిబాబాను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

- Advertisement -

అంతకు ముందు మూడు రోజులు ముందుగానే మల్లెపాక సాయిబాబా స్థానిక తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కు వ్యతిరేకంగా అక్రమ ఇసుక రవాణా, రాజకీయ హత్యలు, భూ దందాలు, ధాన్యం కొనుగోలు కుంభకోణం లాంటి పలు సంఘటనలపై ఒక వాల్ పోస్టర్ విడుదల చేసిన విషయం తెలిసిందే..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు