Sunday, September 8, 2024
spot_img

బీఆర్‌ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌

తప్పక చదవండి
  • మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు రాజీనామా
  • ఏఐసీసీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ సమక్షంలో చేరనున్న జలగం

ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీకి సీనియర్‌ నేత, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు రాజీనామా చేశారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్ఠానానికి రాజీనామా లేఖను పంపించారు. నేడు ఏఐసీసీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ సమక్ష్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జలగం వెంకట్రావు ఢల్లీికి చేరుకున్నారు. వీరి సమక్ష్యంలో వెంకట్రావు కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. గత కొంతకాలంగా పార్టీపై జలగం వెంకట్రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సీఎం కేసీఆర్‌ని కలవడానికి పలుమార్లు అపాయింట్‌మెంట్‌ అడిగిన పట్టించుకోకపోవడంతో పార్టీకి గుడ్‌ బై చెప్పేందుకు జలగం సిద్ధమయ్యారు. దీనికితోడు కొద్దిరోజుల క్రితం ప్రకటించిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాలో కూడా సీఎం కేసీఆర్‌ తనకు మొండిచేయి చూపించడంతో జలగం వెంకట్రావు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కొత్తగూడెం టికెట్‌ ఇస్తుందని జలగం వెంకట్రావు ఆశించాడు. కానీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న తనను సీఎం కేసీఆర్‌ పట్టించుకోకపోవడంతో తన అనుచరులతో సమావేశం అయి కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కీలక నేతలు కూడా తనను గత కొద్దిరోజులుగా సంప్రదిస్తుడడంతో తన రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌ పార్టీ అయితేనే కరెక్ట్‌ అని హస్తం పార్టీలో చేరేందుకు జలగం వెంకట్రావు మార్గం సుగమం చేసుకున్నారు. జలగం సొంత గూటికి చేరుతుండడంతో ఆయన అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జలగం కాంగ్రెస్‌ పార్టీలో చేరితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హస్తం పార్టీ బలం మరింత పెరగనున్నది. కాంగ్రెస్‌ పార్టీ కొత్తగూడెం అసెంబ్లీ టికెట్‌ పెండిగ్‌లో పెట్టడంతో జలగం వెంకట్రావుకు పార్టీ టికెట్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ముమ్మర ప్రచారం జరుగుతోంది. జలగం వెంకట్రావు కాంగ్రెస్‌ పార్టీలో చేరితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు