Sunday, September 8, 2024
spot_img

ఆప్తా సేవలు అమోఘం..

తప్పక చదవండి
  • భారతీయ సంస్కృతి, సనాతన ధర్మాన్ని
    చాటి చెప్పడం అభినందనీయం..
  • కొనియాడిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,
    ఎంపీ బండి సంజయ్ కుమార్

అట్లాంటా :
ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తూ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్తా) చేస్తున్న సేవలు అమోఘమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కొనియాడారు. స్వామి వివేకానంద స్పూర్తితో భారత సంస్క్రుతి, సనాతన ధర్మాన్ని పెంపొందించడం అభినందనీయమన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న బండి సంజయ్ కమార్ అట్లాంటలో కొంసాగుతున్న ఆప్తా నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ… ‘‘ఆపదలో ఆపన్నహస్తం అందిస్తూ అనేక సేవలందిస్తున్న ఆప్తా సంఘం సమావేశానికి హాజరు కావడం ఆనందంగా ఉంది. 2008లో కేవలం 10 మందితో ప్రారంభించిన ఆప్తా నేడు 10 వేల మందికిపైగా సభ్యత్వంతో విస్తరించడం సంతోషం. ఏటా 1500 మందికి స్కాలర్ షిప్పులివ్వడంతో పాటు, వైద్య శిబిరాలు నిర్వహిస్తుండటం, మహిళలకు ఆర్దిక సాయం అందించడం సంతోషం. భారత సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటిన వివేకానందస్వామి స్పూర్తితో ఆప్తా నాయకులు భారతీయ సంస్కృతి, సనాతన ధర్మాన్ని చాటి చెబుతుండటం అభినందనీయం.’’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి భండారు శాంతికుమార్, రాష్ట్ర కార్యదర్శి బొమ్మ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు