Sunday, September 8, 2024
spot_img

ఏపీ హై కోర్టులో నలుగురు జడ్జీల ప్రమాణ స్వీకారం..

తప్పక చదవండి
  • విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా కార్యక్రమం..
  • ఉత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్..

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా శనివారం ఉదయం నలుగురు జడ్జిలు ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం ఘనంగా జరిగింది. కొత్త న్యాయమూర్తులతో ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు ఇతర న్యాయమూర్తులు, ముఖ్యమంత్రి జగన్, నూతన న్యాయమూర్తుల కుటుంబసభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన హరినాథ్‌ నూనెపల్లి, కిరణ్మయి మండవ, సుమతి జగడం, న్యాపతి విజయ్‌ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. న్యాయవాదుల కోటా నుంచి ఈ నలుగురిని న్యాయమూర్తులుగా నియమించాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దాంతో వీరి నియామకానికి కేంద్ర న్యాయశాఖ అక్టోబర్ 18న ఉత్తర్వులిచ్చింది.

ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తుల పోస్టులకు గానూ ప్రస్తుతం 27 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరు ఇతర రాష్ట్రాలకు బదిలీ కాగా, కర్ణాటక నుంచి జస్టిస్‌ నరేందర్‌ బదిలీపై ఏపీ హైకోర్టుకు వస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా నియమితులైన నలుగురు జడ్జిలతో కలిపి ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు