Sunday, September 8, 2024
spot_img

థర్డ్‌ జెండర్లందరు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి

తప్పక చదవండి
  • కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ డాః బి. గోపి
    కరీంనగర్‌ :జిల్లాలోని థర్డ్‌ జెండార్లందరు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాః బి. గోపి అన్నారు.మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో థర్డ్‌ జండర్లతో ఓటరు నమోదు పై జిల్లా కలెక్టర్‌ డాః బి. గోపి సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలోని థర్డ్‌ జండర్లందరు ఓటరు గుర్తింపు కొరకు తమ పేరు నమోదు చేసుకోవాలని, మిగిలిన వారిని కూడా ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఓటరు నమోదులో ఎదురయ్యే సాంకేతిక సమస్యలపై దృష్టి సారించి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఆధార్‌ లో తప్పులు ఉన్నట్లయితే వాటిని సరిచేసుకోవాలని సూచించారు. ఆధార్‌ లు లేని వారు కొత్తగా నమోదు చేసుకొని ఓటరు గుర్తింపు కొరకు ఫామ్‌-6 ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, మెప్మా పీడి రవీందర్‌, సఖీ సెంటర్‌ అడ్మిన్‌ లక్ష్మీ, లీగల్‌ కౌన్సిలర్‌ సంద్య, థర్డ్‌ జెండర్లు తదితరులు పాల్గోన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు