Sunday, September 8, 2024
spot_img

ఆదాబ్‌ ఎఫెక్ట్‌..

తప్పక చదవండి
  • బస్‌ స్టాండ్లు పరిశుభ్రం చేయించిన పీఆర్‌ఓ పోచయ్య..
  • త్వరలోనే పూర్తి మరమ్మతులు చేపడుతాం..
  • ఆదాబ్‌ కథనానికి స్పందించిన
  • ఆర్టీసీ డీఎం సుధా..

చిలిపిచేడ్‌ : చిలిపి చేడ్‌ మండల పరిధిలోని శిథిలావస్థలో ఉన్న బస్సు స్టేష న్లను త్వరలో పూర్తి మరమ్మత్తులు చేసి ప్రజలు ఉపయో గపడేలా చర్యలు తీసుకుంటామని మెదక్‌ ఆర్టీసీ డీఎం సుధా తెలిపారు.

గతకొన్ని రోజులుగా శిథిలావస్థలో ఉన్న బస్‌ స్టాప్‌ లపై ఆదాబ్‌ హైదరాబాద్‌ మంగళవారం పశువుల పాకలు కావు..ప్రయాణ ప్రాంగణాలే..అనే శీర్షికతో కథనం ప్రచురించింది.వెంటనే స్పం దించిన మెదక్‌ డీఎం సుధా తాత్కాలిక మరమ్మత్తులకు అధికారులను ఆదేశించారు.నర్సాపూర్‌ ఆర్టీసీ పీఆర్‌ఓ పోచయ్యతో పాడుపడిన ప్రయాణ ప్రాంగాణాలకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి బస్సు స్టేషన్‌ పరిసరాలను శుభ్రం చేయించారు.త్వరలోనే బస్సు స్టేషన్లను పూర్తి మరమ్మతులు చేసి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేస్తామని వారు హామీ ఇచ్చారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు