Saturday, April 27, 2024

మేడ్చల్ నుండే పోటీ చేస్తా..

తప్పక చదవండి
  • కాంగ్రెస్, బీజేపీ అబ్యర్ధులను నిలపొద్దు..
  • బీ.ఆర్.ఎస్. ను తరిమి కొడతా..
  • ఎన్నికల్లో పోటీపై తీన్మార్ మల్లన్న క్లారిటీ..

మేడ్చల్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు తీన్మార్ మల్లన్న ప్రకటించారు. విపక్ష పార్టీలు ప్రశ్నించే గొంతు మిగిలాలంటే తనపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థులను పోటీకి నిలుపొద్దని తీన్మార్ మల్లన్న అన్నారు. గత పది సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎదుర్కొంటున్న ఏకైక వ్యక్తిని తానేనని అన్నారు. రాష్ట్రంలో ఏ వ్యక్తి మీద పెట్టని కేసులు తనపై పెట్టారని, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇంతకన్నా అర్హత ఏముంటదని మల్లన్న ప్రశ్నించారు. శనివారం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ బాలుర బాలికల ఉన్నత పాఠశాల 9, 10వ తరగతి విద్యార్థులకు తీన్మార్ మల్లన్న నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. అయితే.. గత కొంతకాలంగా నవీన్ పోటీపై వస్తున్న వార్తలపై మంత్రి మల్లారెడ్డి స్పందిస్తూ.. తీన్మార్ మల్లన్న తనపై పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావు అంటూ.. కామెంట్ చేశారు. ఈ కామెంట్‌‍పై స్పందించిన తీన్మార్ మల్లన్న.. ఆయన డిపాజిట్ల స్పెల్లింగ్ చెప్పిన తర్వాత ఆ వ్యాఖ్యలపై స్పందిస్తానని.. సెటైర్ వేస్తూనే కొట్టిపారేశారు.

ఇదిలా ఉంటే.. వచ్చే ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన చింతపండు నవీన్.. ఏ పార్టీ తరపున బరిలో దిగనున్నారన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కాగా.. ఆయన బీజేపీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత.. సొంతంగా ఓ కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. “తెలంగాణ నిర్మాణ పార్టీ” అనే పేరుతో కొత్త పార్టీ పెడుతున్నట్టు గతంలోనే మల్లన్న తెలిపారు. ఇప్పటికే ఈ పేరును రిజిస్టర్ కూడా చేయించినట్టు చెప్పుకొచ్చారు. అయితే.. ఆ పార్టీకి ఎన్నికల వరకు గుర్తింపు వస్తుందా లేదా..? అన్నది వేచి చూడాలి. ఒకవేళ వస్తే మాత్రం తన పార్టీ నుంచే బరిలోకి దిగనున్నారు. మరి ఒకవేళ గుర్తింపు రాకపోతే.. విపక్ష పార్టీల్లో ఏదో ఓ పార్టీ తరపున పోటీ చేస్తారా లేదా.. ? ఇండిపెండెంట్‌గా బరిలో నిలుస్తారా..? అనేది అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే. ఈ కార్యక్రమంలో మల్లన్న టీం సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు