Saturday, April 27, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

ఈ రోజుల్లో.. జర్నలిస్టులే జనం గోడు మరిచి
పార్టీ కార్యకర్తలై జేజేల నినాదాలు రాసుకొస్తున్నారు.
ఎదురు తిరగాల్సిన ఎడిటర్లే ఎదురెల్లిపోయి
సాష్టాంగ నమస్కారం చేసి పొద్దుకో పార్టీకి
పట్టాభిషేకం చేస్తున్నారు.
చైతన్యం చేయాల్సిన పత్రికలే జనం బుర్రలలోకి
నిస్సారమైన భావాలను జొప్పించి
ఉద్యమహీనులని చేస్తున్నాయి.
వాస్తవాలను రాయలేని పత్రికలు సమాజాన్ని
తప్పుదోవన నడిపిస్తున్నాయి.
తెర వెనుక సంఘటనలపై మన్నుగప్పి ఉత్తుత్తి
భావాలను ప్రచారం చేసే పాడు పత్రికల కాలం
ఇప్పుడు నడుస్తోంది.
గద్దే దించాల్సిన దినపత్రికలే గజదొంగలను
గద్దెనెక్కిస్తున్నాయి.

  • సన్నీ
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు