- చంద్రుడి ఆర్బిట్లోకి ప్రవేశించిన మాడ్యూల్
బెంగళూరు ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్3 ప్రాజెక్టు మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. బుధవారంమరోసారి ఫైరిగ్ ను విజయవంతంగా చేయడం ద్వారా.. చంద్రయాన్
3 ను 153 బై 163 కిలోవిూటర్ల ఆర్బిట్ లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. అంటే దీని ద్వారా చంద్రుడి చుట్టూ ప్రదక్షిణలు, అదే తిరగడం ఇక అయిపోయిందన్నమాట. సులభంగా చెప్పాలంటే చంద్రయాన్3 అనే యాత్ర పూర్తి చేసుకున్న ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఆగస్ట్ 17వ తేదీన ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ వేరు పడుతుందన్నమాట. ఇలా సెపరేట్ అయిన ల్యాండర్ మాడ్యూల్ ఆగస్ట్ 23వ తేదీన మెల్లగా ల్యాండ్ అయితే చంద్రయాన్
3 మిషన్ విజయవంతం అయినట్టుగా భావిస్తారు. చంద్రయాన్3 153 బై 163 కిలోవిూటర్ల ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టారు. ఇక్కడి నుంచి 100 కిలోవిూటర్ల దూరం చేరేదాకా ప్రయాణించి అక్కడి నుంచి ల్యాండర్ జంప్ చేస్తుందన్నమాట. ఇస్రో శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఆగస్ట్ 23వ తేదీన అది ల్యాండ్ అవుతుంది. అంటే సరిగ్గా ఇంకో వారమే ఉందన్నమాట.. ప్రయోగం విజయవంతమో కాదో తేలడానికి ఇదే కీలకం. క్షేమంగా ల్యాండ్ అయితే ప్రయోగం సక్సెస్ అయినట్లే.శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జూలై 14న చంద్రయాన్
3ని విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ అంతరిక్ష నౌక ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ కానుంది. ఇప్పటికే అంతరిక్ష నౌక ఇటీవల చంద్రుడి దూరంలో మూడిరట రెండు వంతుల దూరాన్ని కవర్ చేసింది. ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ ల్యాండిరగ్ అయితే చరిత్ర సృష్టించినట్లే. చంద్రుడిపై చంద్రయాన్-3 సాప్ట్ ల్యాండిరగ్ను నిర్దారించడానికి వివిధ ఎలక్టాన్రిక్, మెకానికల్ సబ్సిస్టమ్ లతో కూడిన నావిగేషన్ సెన్సార్లు, ప్రొపల్షన్ సిస్టమ్లు ఉన్నాయి. వాటితో పాటుగా రోవర్ను సురక్షితంగా దించడానికి టూ-వే కమ్యూనికేషన్ సంబంధిత యాంటెనాలు, ఇతర ఆన్బోర్డ్ ఎలక్టాన్రిక్స్ యంత్రాంగాలు ఉన్నాయి. చంద్రయాన్ ప్రధాన లక్షాలు మొదటగా సురక్షిత ల్యాండిరగ్ చేయడం, చంద్రుడి పై రోవర్ను దించడం, ఇన్-సిటు శాస్త్రీయ ప్రయోగాలు చేయడమే. చంద్రయాన్-3 అభివృద్ధి దశ జనవరి 2020లో ప్రారంభమైంది. 2021లో ప్రయోగించాల్సి ఉంది. అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా మిషన్ కొంత కాలం వాయిదా పడుతూ వచ్చింది. 2019లో చంద్రయాన్-2 చంద్రుని ఉపరితలంపై సాప్ట్ ల్యాండిరగ్ సమయంలో ఎదుర్కొన్న సవాళ్లు, ప్రధాన మిషన్ విఫలమడంతో శాష్తవ్రేత్తలు చంద్రయాన్-3కి శ్రీకారం చుట్టారు.చంద్రయాన్-1 మిషన్ సమయంలో ఉపగ్రహం చంద్రుని చుట్టూ 3400 కంటే ఎక్కువ సార్లు తిరిగింది. ఆగష్టు 29, 2009న అంతరిక్ష నౌకతో కమ్యూనికేషన్ కోల్పోవడంతో మిషన్ ముగిసింది. తాజాగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చైర్మన్ సోమనాథ్ గత వారం చంద్రయాన్ 3 పురోగతిపై విశ్వాసం వ్యక్తం చేశారు. అన్ని వ్యవస్థలు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాయని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం అంతా సవ్యంగా జరుగుతోందని, ఆగస్ట్ 23న చంద్రునిపై ల్యాండిరగ్ చేసేందుకు వరకు వరుసగా కక్ష్య విన్యాసాలు చేస్తున్నామన్నారు.
తప్పక చదవండి
-Advertisement-