జై భీమ్ ఆర్మీ చీఫ్, అంబేద్కరిస్ట్ జాతీయ అధ్యక్షుడు ఆజాద్ సమాజ్ పార్టీ చంద్రశేఖర్ ఆజాద్ హైదరాబాద్ నగరానికి విచ్చేసిన సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, అభినందించిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి, పలువురు తెలంగాణ కార్పొరేషన్ చైర్మన్లు. ఆ తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్లి, ఎమ్మెల్సీ కవిత, చైర్మన్లు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.